మరికొద్ది రోజుల్లో న్యూ ఇయర్ సందర్భంగా ఎవరికి వారు భారీగా ప్లాన్ లు వేసుకుంటూ ఉన్నారు.సరిగ్గా న్యూ ఇయర్ సందర్భంగా సరికొత్తగా కుటుంబ సభ్యులు ఒకలా స్నేహితులు మరొకలా ప్లాన్స్ వేసుకుంటూ ఇప్పటికే రెడీ అవుతున్నారు.
ఇదే క్రమంలో కొన్ని ప్రభుత్వాలు.ఆరోజు మద్యం దుకాణాలు.
డిసెంబర్ 31 నుండి అర్ధరాత్రి వరకు తెరుచుకునే రీతిలో అనుమతులు కూడా ఇవ్వటం చూస్తూ ఉన్నాం.
పరిస్థితి ఇలా ఉంటే వైజాగ్ వాసులు ముఖ్యంగా బీచ్ ఇష్టపడే వాళ్లకు.
ఏపీ ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ తెలిపింది.బీచ్ ఒడ్డున న్యూ ఇయర్ వేడుకల విషయంలో ఆంక్షలు విధించింది.
ఈ విషయాన్ని సిపి మనీష్ కుమార్ సిన్హా తెలియజేశారు.వేడుకలకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వడం లేదన్నారు.
డిసెంబర్ 31న యారాడ నుండి భీమిలి వరకు బీచ్ రోడ్ సాయంత్రం 6 గంటలకు మూసివేయనున్నట్టు తెలిపారు.అదే విధంగా నగర పరిధిలో ఉండే ఫ్లైఓవర్ లను కూడా సాయంత్రం 6 గంటల తర్వాత.
క్లోజ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.బహిరంగ ప్రదేశాల్లో న్యూ ఇయర్ వేడుకలకి అనుమతి లేదని అదేవిధంగా రాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్ లకి కూడా అనుమతులు లేవని.
ఇంటి వద్ద నుండే.వేడుకలు జరుపుకోవాలని.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.