14 రీల్స్ ఎంటర్తైన్మెంట్, టాలివుడ్ లో ఉన్న పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటి.మొదటి చిత్రం నమో వేంకటేశతో ఓ మోస్తారు ఎంట్రీ ఇచ్చిన ఈ బడా ప్రొడక్షన్ హౌజ్, రెండోవ సినిమాతోనే పెను ప్రకంపనలు సృష్టించింది.
సూపర్ స్టార్ మహేష్ తో తీసిన దూకుడు సంచలన విజయాన్ని నమోదు చేసుకోని, అప్పటివరకు టాలివుడ్ లో కనివిని ఎరుగని రికార్డులు సృష్టించింది.రెండోవ చిత్రంతోనే బడా నిర్మాతలు అయిపోయారు రామ్ ఆచంట, గోపి ఆచంట మరియు అనీల్ సుంకర.
కాని అప్పుడు వారు అనుకోలేదు ఏమో, అదే వారి చివరి బ్లాక్బస్టర్ గా, కొన్నేళ్ళు ఉండిపోతుంది అని.బేసిక్ గా మహేష్ బాబు అభిమానులు అయిన వీరు, ఆ అభిమానంతోనే తమ హీరో డేట్స్ అన్ని తమ దగ్గరే ఉండేలా వరుసపెట్టి సినిమాలు సైన్ చేయించుకున్నారు.దూకుడు తరువాత 1 – నేనొక్కడినే మరియు ఆగడు సినిమాలు చేసారు 14 రీల్స్.
1 – నేనొక్కడినే భారీ బడ్జెట్ సినిమా.విపరీతమైన అంచనాలు, అప్పట్లోనే 70 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్, భారి ప్రమోషన్స్ తో బాగా హైప్ జనరేట్ చేసుకున్న ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర భారి డిజాస్టర్ గా నిలించింది.కాలక్రమంలో టాలివుడ్ వారు గర్వంగా చెప్పుకునే సినిమాగా పేరు తెచ్చుకున్నా, కాసులు మాత్రం రాలేదు.ఆ దెబ్బతో డీలాపడ్డ 14 రీల్స్ వారు, మళ్ళీ దూకుడు కాంబినేషన్ ని నమ్ముకొని ఆగడు తీస్తే, అది కూడా పోయింది.1 తీసినందుకు కనీసం పొగడ్తలైనా వచ్చాయి.ఆగడు ఆ చప్పట్లు కూడా లేవు.అప్పులు పెరిగిపోయాయి.అయినా మొండిగా మహేష్ బాబుని మరో సినిమా అడిగారు.వారి అదృష్టం ఏమిటంటే, ఆ సినిమానే బ్రహ్మోత్సవం.
అది తరువాత పివిపి చేతిలో పడి 14 రీల్స్ కి మేలు చేసింది.
బాలకృష్ణతో చేసిన లెజెండ్, నానితో తీసిన కృష్ణగాడి వీరప్రేమగాధ .ఈ రెండు ఓ మోస్తారు హిట్స్.కాని వీటివల్ల నిర్మాతలు పెద్దగా లాభపడింది లేదు.
ఆ తరువాత వచ్చిన హైపర్ చుక్కలు చూపిస్తే, ఇప్పుడొచ్చిన లై వారి ఫామ్ ని కంటిన్యూ చేస్తూ, డిజాస్టర్ రిజల్ట్ వైపు దూసుకువెళుతోంది.బడా సినిమాలు తీసినా, అవే నష్టాలు, మీడియం బడ్జెట్ సినిమాలు తీసినా, అవే నష్టాలు.
మహేష్ తో మొదలైన దరిద్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.
అయినా వీరు ఆశలు వదులుకోవడం లేదు.
బాలకృష్ణ – బోయపాటితో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు.ఈ సినిమాతో బడ్జెట్ కూడగట్టుకొని మళ్ళీ మహేష్ బాబుతో సినిమా చేస్తారట.
అభిమానం బాగానే ఉంది, కాని వారు ఎంచుకునే కథలే బాగాలేవు.