సీమాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు బీజేపీనె టార్గెట్ చేస్తున్నట్లు ఉన్నాయి అన్న వాదన బలంగా వినిపిస్తుంది.చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా పర్యటనలో కొన్ని ఆసక్తికరమైన ఆరోపణలు చేశారు.
ఈ ఆరోపణలు భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరంగా ఉన్నాయి.ఒకరకంగా బీజేపీని విలన్ గా చేసి చూపేటట్టుగా ఉన్నాయి తెలుగుదేశం అధ్యక్షుడి మాటలు.
రుణమాఫీ వ్యవహారం గురించి బాబు స్పందిస్తూ… కేంద్ర ప్రభుత్వం దానికి సహకరించడం లేదని అన్నాడు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేకపోయినా.
తాము రుణమాఫీ ని చేస్తున్నామని.ఇప్పటికే రైతు రుణమాఫీ అయిపోయిందని బాబు చెబుతున్నారు.
ఇక డ్వాక్రా మహిళల రుణమాఫీని చేయాల్సి ఉంటుందని.దాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని బాబు చెప్పుకొచ్చారు.
ఒకవైపు రైతు రుణమాఫీ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది లేదు.సంపూర్ణ రుణమాఫీ అన్న చంద్రబాబు నాయుడు సవాలక్ష మెలికలు పెట్టి.
దాన్ని రానున్న ఐదేళ్ల సీరియల్ గా పొడిగించాడు.దీంతో రైతులు లబోదిబో మంటున్నారు.
అయితే బాబు మాత్రం రైతు రుణమాఫీ జరిగిపోయిందని అంటున్నారు.ఇక డ్వాక్రా మాఫీ ఒకటే పెండింగ్ అంటున్నారు.
ఈ సంగతిలా ఉంటే.రుణమాఫీకి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని బాబు చెప్పడం ఆసక్తికరంగా ఉంది.
మరి రుణమాఫీ అనేది తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీ మాత్రమే.రుణమాఫీకి సహకరిస్తామని కేంద్రంలో అధికారంలోకి వచ్చి భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ చెప్పలేదు.
అయితే బాబు మాత్రం జనాల ముందు రుణమాఫీలో లొసుగులకు బీజేపీకి బాధ్యతను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడు.మరి దీనిపై కమలం పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.