ప్రముఖ నటుడు బాబు మోహన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అందరు దర్శకులు నన్ను ప్రోత్సహించారని చెప్పుకొచ్చారు.రాఘవేంద్రరావు గారు నన్ను ఎంతో ప్రేమిస్తారని ఆయన కామెంట్లు చేశారు.
ఒక సినిమాకు తాను డేట్లు కేటాయించడం కష్టమైతే రాఘవేంద్రరావు తాను కచ్చితంగా చేయాలని కోరి రోజులో కనీసం అరగంట అయినా షూటింగ్ కు రావాలని అడిగారని తాను గంట సమయం పాటు హాజరై షూటింగ్ లో పాల్గొనేవాడినని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.
12 రోజులు తాను గంట చొప్పున సినిమాలో నటించినా తాను సినిమా మొత్తం కనిపిస్తానని ఆయన వెల్లడించారు.
దాసరి నారాయణరావు నా బిడ్డేడి అని నా గురించి అడిగేవారని ఆయన కామెంట్లు చేశారు బి.గోపాల్, శరత్, ఎస్వీ కృష్ణారెడ్డి, కోడి రామకృష్ణ, ఇ.వి.వి.సత్యనారాయణ తనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారని ఆయన కామెంట్లు చేశారు.తనను లక్కీ లెగ్ అనేవారని బాబు మోహన్ కామెంట్లు చేశారు.
అప్పట్లో తాను ఐదు, ఆరు షిప్ట్ లు చేసిన రోజులు కూడా ఉన్నాయని బాబు మోహన్ వెల్లడించారు.షూటింగ్ సమయంలో ఫ్యామిలీ తనను చాలా మిస్సైందని ఆయన కామెంట్లు చేశారు.తనకు మొదటి ఇంటర్వ్యూలోనే ఉద్యోగం వచ్చిందని ఆయన తెలిపారు.తను చినుకు చినుకు అందెలతో సాంగ్ చేసిన మాయలోడు సినిమా 365 రోజులు థియేటర్లలో ఆడిందని అయన చెప్పుకొచ్చారు
365వ రోజున కొంతమంది ప్రేక్షకులు ఆ పాట కోసం సినిమా థియేటర్ కు వచ్చి పాట చూసి వెళ్లిపోయారని బాబు మోహన్ కామెంట్లు చేశారు.ఒక్క పాటతో 365 రోజులు సినిమా ఆడిన చరిత్ర నాకు మాత్రమే సొంతమని బాబు మోహన్ అన్నారు.తనతో సినిమా చేసిన సమయంలో సౌందర్య టాప్ హీరోయిన్ కాదని బాబు మోహన్ కామెంట్లు చేశారు.