టాలీవుడ్లో కమెడియన్గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న బాబుమోహన్, ఇటీవల కాలంలో వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్గానూ చాలా నష్టపోయారు.అటు సినిమాల పరంగా, రాజకీయాల పరంగానూ మంచి పేరున్న బాబుమోహన్ రెండింటిలోనూ పరాభవం పాలవ్వడంతో ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు.
అయితే ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ వల్ల బాబు మోహన్ కూడా ఇంటికే పరిమితం అయ్యాడు.
కాగా కరోనా మహమ్మారి పట్ల ప్రజలను చైతన్యపరిచేందుకు బాబుమోహన్ తాజాగా ఓ వీడియో చేశాడు.
ఈ వీడియోను బాబుమోహన్ పాట రూపంలో ప్రజలకు అందించగా, అది అందరి మన్ననలు అందుకుంటోంది.‘‘రామలింగా ఓరి సోమలింగా.’’ అంటూ సాగిన ఈ పాటలో బాబు మోహన్ అభినయం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.పాడిన వారి పేరును చెప్పకున్నా, ఈ పాటతో బాబుమోహన్ మరోసారి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు.
ఈ పాట సారాంశం చూస్తుంటే సామాన్యుల కళ్లు చెమర్చడం ఖాయం.
అంతలా లోతైన పదాలను అమర్చిన సాంగ్ రైటర్కు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి అంటున్నారు ఈ పాట విన్న ప్రేక్షకులు.
‘‘బతికుంటే బలిసాకు తినైనా బతకొచ్చు.’’ అనే డైలాగుతో కేసీఆర్ మాటలను గుర్తుకు చేయడంతో ఈ వీడియో సాంగ్ను ప్రేక్షకులు తెగ షేర్లు చేస్తున్నారు.
ఏదేమైనా మరోసారి బాబుమోహన్ ఈ పాటతో లైమ్లైట్లోకి వచ్చాడని అనుకోవచ్చు.మరి ఈ పాటపై మీరూ ఓ లుక్కేయండి.