సీనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి కొన్నిరోజుల క్రితం సీనియర్ ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడానని చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అయ్యాయనే సంగతి తెలిసిందే.లక్ష్మీపార్వతి చేసిన కామెంట్ల గురించి కొంతమంది నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు చేశారు.
బిగ్ బాస్ కంటెస్టెంట్, ప్రముఖ హేతువాది అయిన బాబు గోగినేని లక్ష్మీపార్వతి చేసిన కామెంట్ల గురించి తనదైన శైలిలో సెటైర్లు వేయడం గమనార్హం.
సీనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ, వైఎస్సార్ ఆత్మలు తనతో మాట్లాడినట్టు బాబు గోగినేని కామెంట్లు చేశారు.
ప్రస్తుతం లక్ష్మీ పార్వతి వైసీపీలో ఉన్న సంగతి తెలిసిందే.తన పేరు చెప్పుకొని తన పేరుతో పెట్టిన పార్టీని వీడి మరో పార్టీలోకి వెళ్లిన లక్ష్మీపార్వతి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని సీనియర్ ఎన్టీఆర్ తనతో చెప్పారని బాబు గోగినేని తెలిపారు.
సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన విషయాలకు హరికృష్ణ తలూపారని వైఎస్సార్ కూడా లక్ష్మీపార్వతి చేసేది రైట్ కాదని తనతో చెప్పారని బాబు గోగినేని కామెంట్లు చేశారు.
ఈ ముగ్గురి ఆత్మలు తనతో ఈ విధంగా చెప్పినట్టు తన దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని బాబు గోగినేని చెప్పుకొచ్చారు.మనం ఆధునిక మానవులమని ప్రజలను మభ్యపెట్టడం కొరకు ఇలా చేసే తమాషాలకు దూరంగా ఉండాలని బాబు గోగినేని కామెంట్లు చేశారు.దయ్యాలు, పిశాచాలు ఆత్మలు ఎక్కడున్నాయని లక్ష్మీపార్వతిని బాబు గోగినేని ప్రశ్నించారు.
భర్తను కోల్పోయింది కాబట్టి ఆమె ఈ విధంగా కామెంట్లు చేసి ఉండవచ్చని బాబు గోగినేని తెలిపారు. లక్ష్మీపార్వతి పొలిటికల్ గా ఎదగడం కొరకు ఆత్మల గురించి చెప్పడాన్ని తాను ఖండిస్తున్నానని బాబు గోగినేని అన్నారు.అగ్నికి ఆజ్యం పోయవద్దని మూఢ నమ్మకాల వల్ల ప్రజల పరిస్థితి అన్యాయంగా మారిందని బాబు గోగినేని కామెంట్లు చేశారు.బాబు గోగినేని చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.