ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు.ఈ నేపధ్యంలో పార్టీకి చెందిన పలువురులు నేతలతో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరపనున్నట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే మంగళగిరి లోని హ్యాపీ రిసార్ట్స్ లో ఈ రోజు బాబు తమ పార్టీ నేతలతో సమావేశమై సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలుస్తుంది.రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ సరళి పై కూడా బాబు ఈ సమావేశం లో చర్చించారు.
ఈ సమీక్ష సమావేశం కోసం రాజమండ్రి నియోజకవర్గం నుంచి 50 మంది కీలక నేతలు హాజరైనట్లు తెలుస్తుంది.
అలానే పోలింగ్ సరళి, కౌంటింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.
ఈ సారి ఎన్నికల్లో ఈవీఎం ల పనితీరు విషయంలో బాబు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఐదు ప్రాంతాల్లో రీ పోలింగ్ కూడా జరగనుంది.