రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలోని భయంకరమైన పరిణామాలను చూస్తుంటే బల్గేరియాకు చెందిన ఫకీర్ వెంగా బాబా భవిష్యవాణిపై ప్రజలకు విశ్వాసం పెరుగుతోంది.ప్రపంచంలోని అనేక సంఘటనల గురించి చాలా సంవత్సరాల క్రితం బల్గేరియాకు చెందిన ఈ అంధ ఆధ్యాత్మికవేత్త చెప్పిన భవిష్యవాణి నిజమయ్యింది.
దీంతో జనం వెంగాబాబా ఇంకా ఏమేమి చెప్పారోనని తెలుసుకునే పనిలో పడ్డారు.కొన్నేళ్ల క్రితం వెంగాబాబా.
రష్యాతో పాటు పుతిన్ సామ్రాజ్యం గురించి తెలిపారు.
చనిపోయేముందు బాబా వెంగా తన అనుచరులకు భవిష్యవాణి చెప్పారని అందులో అమెరికాపై 9/11 దాడి, భారతదేశంలో మిడతల దాడి, బరాక్ ఒబామా అధ్యక్షుడు కావడం, రోడ్డు ప్రమాదంలో యువరాణి డయానా మరణం, థాయ్లాండ్ విధ్వంసం తదితర అంశాలు ఉన్నాయి.
దీనిలో సునామీ, కరోనా వైరస్ విధ్వంసం పూర్తిగా నిజమని నిరూపితమయ్యింది వెంగా బాబా.రష్యా, పుతిన్ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పారు, అది ఇప్పుడు ఉక్రెయిన్పై దాడితో నిజమనిపిస్తోంది.
అమెరికా రాచరికం అంతమయ్యే సమయం వస్తుందని, పుతిన్ రాజ్యాన్ని ప్రపంచం చూసే సమయం వస్తుందని వెంగా బాబా తెలిపారు.
రాబోయే కాలంలో రష్యా ప్రపంచానికి లీడర్ అవుతుందని, యూరప్ బంజరు భూమిలా మారుతుందని.వాలెంటిన్ సిడోరోవ్ అనే రచయితకు బాబా వెంగా తెలిపారు.1996లో తన మరణానికి ముందు, వెంగాబాబా 5079 వరకు భవిష్యవాణి వినిపించారు.5079 నాటికి ప్రపంచం అంతం అవుతుందని వెంగా బాబా తెలిపారు.ఉక్రెయిన్పై రష్యా దాడి, నాటో వైఫల్యం, రష్యా సార్వభౌమాధికారం గురించి వెంగాబాబా చెప్పినది రుజువు అవుతోంది.