కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి అన్ని దేశాల ప్రజలని భయపెడుతుంది.ఇక అమెరికా, ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలలో భయానక వాతావరణం కనిపిస్తుంది.
అక్కడ రోజు వందల సంఖ్యలో చనిపోతున్నారు.ఇక ఈ కరోనా వైరస్ అనేది చైనా చేస్తున్న బయోలాజికల్ వార్ అని అందరూ భావిస్తున్నారు.
కావాలనే దేశాల ఆర్ధిక వ్యవస్థలని దెబ్బ తీయడానికి చైనా ప్రయోగించిన బయో వెపన్ ఈ కరోనా వైరస్ అని కూడా చాలా మంది నమ్ముతున్నారు.ఈ నేపధ్యంలో ప్రపంచం మొత్తం చైనా వైపు వేలెత్తి చూపిస్తుంది.
అయితే ఇన్ని విమర్శలు వస్తున్నా చైనా మాత్రం ఒక్క మాట కూడా అనకుండా సైలెంట్ గా ఉంది.ఈ నేపధ్యంలో ఇప్పుడు చైనాని ప్రపంచ దేశాలన్నీ శత్రువుగా చూస్తున్నాయి.
ఇదిలా ఉంటే కోవిడ్-19 మహమ్మారి ప్రపంచమంతటా వ్యాపించడానికి కారణం చైనాయేనని యోగా గురువు బాబా రామ్ దేవ్ ఆరోపించారు.అంతర్జాతీయ సమాజం రాజకీయంగా, ఆర్థికంగా చైనాను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
దీనికోసం భారత దేశం దౌత్యపరంగా చొరవ తీసుకోవాలని కోరారు.బాబా రామ్ దేవ్ శనివారం ఇచ్చిన ట్వీట్లో చైనా వాస్తవంగా అమానవీయ, అనైతిక చర్యకు పాల్పడింది, యావత్తు ప్రపంచాన్ని తీవ్రమైన ప్రమాదంలోకి నెట్టింది.
ఇందుకు రాజకీయంగా, ఆర్థికంగా బహిష్కరించడం ద్వారా చైనాను అంతర్జాతీయ సమాజం శిక్షించాలి.ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత దేశం దౌత్యపరమైన చొరవను తీసుకోవాలి అని పేర్కొన్నారు.
ఇక రామ్ దేవ్ బాబా వాఖ్యాలకి సోషల్ మీడియాలో విపరీతమైన మద్దతు లభించింది.చైనా అహంకారం అణచాలంటే అది భారత్ తోనే సాధ్యం అని కామెంట్లు చేస్తున్నారు.