జే యెన్ యూ విద్యార్ధులని రెచ్చగొడుతున్న బాబా రాం దేవ్ ?

ప్రస్తుతం స్టూడెంట్స్ యూనియన్ ల గొడవలతో అట్టుడుకుతున్న జే ఎన్యూ క్యాంపస్ మరొక వివాదానికి వేదిక గా మారబోతోంది.జీ యెన్ యూ క్యాంపస్ లో బాబా రాం దేవ్ ఒక భారీ యోగా సదస్సు, శిబిరం నిర్వహించాలని చూస్తున్నారట.

 Baba Ramdev Mocking Jnu Students?-TeluguStop.com

విద్యార్ధులకి సరైన దిశా నిర్దేశం చెయ్యడం కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు అని తెలుస్తోంది.యోగా శిబిరం విషయం బాబా తమతో చెప్పారు అని ఆయన ప్రతినిథి మీడియా కి చెప్పడం విశేషం.

త్వరలో ఒక బృహత్ ప్రణాళిక తో ఆయన ముందుకి ఒస్తారట.పోయిన సంవత్సరం కూడా వేదాంత – ఆయుర్వేద అంశాల మీద యూనివర్సిటీ లో జరిగిన ఒక విద్యా సదస్సు లో బాబా రాందేవ్ ప్రసంగం కోసం రావడానికి సిద్దం అవ్వగా ఆయన్ని అడ్డుకున్నారు చాలా మంది.

జే ఎన్ యూ విద్యార్ధి సంఘం కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది ఈ విషయం లో.అయితే ఈ సదస్సుకు రాందేవ్ బాబా హాజరు కాలేదు.ఇదిలా ఉండగా వ్యక్తిగత హోదాలో ఆయన జేఎన్ యూకు వస్తే తమకేమీ అభ్యంతరం లేదని జేఎన్ యూ విద్యార్థి సంఘాలు ప్రకటించాయి.అయితే తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటే వ్యతిరేకిస్తామని వారు స్పష్టం చేశారు.

చూస్తుంటే త్వరలో జేఎన్ యూలో రాందేవ్ బాబా రచ్చ కొనసాగేలా ఉందంటున్నారు.ఇదంతా మోడీ ప్రభుత్వం కావాలనే విద్యార్ధులని రెచ్చ గొట్టడం కోసం వేస్తున్న ఎత్తిగడ అనే వారు కూడా లేకపోలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube