నిన్న సాయంత్రం నుంచి ఇంటర్నెట్ ప్రపంచంలో ఒకటే గందరగోళం.బాహుబలి రెండొవభాగానికి సంబంధించి ఓ కీలక సన్నివేశం ఆన్ లైన్ లో దర్శనమిచ్చింది.
దాదాపుగా మూడు నిముషాల నిడివి ఉన్న ఆ సీన్ లీక్ అయిన కాసేపటికి నిర్మాతలు చాలా చోట్ల నుంచి తొలగించినప్పటికి, వాట్సాప్ ద్వారా ఒకరి తరువాత ఒకరికి చేరుతూనే ఉంది.ఇంకా డిఐ పనులు పూర్తి కాని ఆ సీన్ ని ఎవరు లీక్ చేసారు? ఎందుకు చేసారు?
బాహుబలి మొదటి భాగానికి కూడా ఇలానే జరిగింది.అప్పుడు కూడా ఓ సీన్ లీక్ అయ్యింది.ఇదంతా బాహుబలి నిర్మాతలే కావాలని పబ్లిసిటీ కోసం చేస్తున్నారా? అవునేమో అని అంటున్నారు ఫిలింనగర్ ప్రజలు.
మొన్నటికి మొన్న జూనియర్ ఎన్టీఆర్ బాహుబలి 2లో అతిథి పాత్ర చేయనున్నాడని వార్తలు వచ్చాయి.ఆ వార్తలు, ఇప్పుడు ఈ వీడియో, రెండు బాహుబలి పీఆర్ టీమ్ చేసిన పబ్లిసిటి స్టంట్స్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అలా ఏం జరిగి ఉండదు.వందల కోట్లు ఖర్చుపెట్టి తీస్తున్న సినిమాలో కీలక సన్నివేశాన్ని నిర్మాతలు ఎందుకు లీక్ చేస్తారు? ఇక ఎన్టీఆర్ పై వచ్చిన వార్తలు చాలా కామన్.అలాంటి గాసిప్పులు రోజుకి ఎన్ని పుట్టవని వాదిస్తున్నారు మరికొంత మంది.