బాహుబలి రెండొవభాగం 2016లోనే వస్తుందంటు మొదటిభాగం రాకముందే ప్రకటించేసాడు రాజమౌళి.అదీకాక మొదటిభాగం అయిపోగానే స్క్రీన్ మీద బాహుబలి – ది కంక్లుజన్ 2016లో అని పెద్దగా కనబడుతుంది కూడా.
పక్కగా ప్లాన్ చేస్తే తప్ప రాజమౌళి ఇలా ప్రకటించడు.కాని రాజమౌళి ప్లాన్ దెబ్బతింది.
అందుకే 2017కి షిఫ్ట్ చేసారు.దీనికి పూర్తి కారణంగా కాదు కాని అనుష్కని కూడా ఓ కారణంగా చెబుతున్నారు.
ఇంతకి అనుష్క ఏం తప్పు చేసిందు అనుకుంటున్నారా… తప్పేమి చేయలేదు కాని, కాస్త అజాగ్రత్తగా వ్యవహరించింది.సైజ్ జీరో కోసం అనుష్క బాగా బరువు పెరిగిన సంగతి తెలిసిందే.
ఆ బరువుని అనుకున్న సమయానికి కరిగించలేకపోయింది స్వీటి.కృతిమ పద్ధతులు పాటిస్తే ఎప్పుడో బరువు తగ్గేదే కాని, సహజంగానే బరువు తగ్గాలనుకుంది అనుష్క.
దాంతో గీసుకున్న ప్లాన్ లో మార్పులు చోటుచేసుకున్నాయి.షెడ్యూలు మార్చాల్సివచ్చింది.
ఆదరబాదరగా ఎందుకు తీయడం .మాట మీద నిలబడకపోతే ఏం .తీరిగ్గా వద్దాం అని రాజమౌళి కూడా 2017 కి వాయిదా వేసాడు.ఈసారి గ్రాఫిక్స్ వర్క్ మొదటిభాగం కన్నా ఎక్కువ ఉండటం ఈ చిత్రం వాయిదా పడటానికి ప్రధాన కారణం.
ఇక ప్రకటించనట్లుగా వచ్చే ఏడాది ఏప్రిల్ 14 సినిమా వాయిదా పడకుండా వచ్చేస్తే చాలు.