సౌత్ ఇండియా హీరోల ఎదుగుదలని బాలీవుడ్ ఎప్పుడూ సహించదు.బాలీవుడ్ స్టార్స్ ని మన తెలుగు హీరోలు డామినేట్ చేస్తున్నారు అంటే ఏదో ఒక విధంగా నెగిటివ్ ప్రచారంతో వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది.
బాలీవుడ్ హీరోలే గొప్పవాళ్ళుగా ప్రాజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది.గతంలో ఈ విధానం ఎక్కువగా కనిపించేది.
అయితే బాహుబలి సినిమా తర్వాత పూర్తిగా సినిమా హద్దులు చెరిగిపోయాయి.మన సౌత్ హీరోలు బాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు.
ముఖ్యంగా ప్రభాస్ ని స్టార్ హీరోగా బాలీవుడ్ ప్రేక్షకులు చేస్తున్నారు.ఈ నేపధ్యంలో తెలుగులో ఏవరేజ్ టాక్ వచ్చిన సాహూ మూవీ కూడా బాలీవుడ్ సూపర్ హిట్ అయ్యింది అంటే దానికి కారణం అక్కడి ప్రేక్షకులు ప్రభాస్ ని ఆదరించే విధానం.
అయితే ఒక వర్గం బాలీవుడ్ మీడియా ప్రభాస్ ఎదుగుదలని నియంత్రించాలని ప్రయత్నిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నాడు.
అయితే రాధేశ్యామ్ కి బాలీవుడ్ మీడియా అనుకున్న స్థాయిలో ప్రచారం కల్పించడం లేదనే మాట వినిపిస్తుంది.అలాగే ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ఆది పురుష్ టైటిల్ తో పాన్ ఇండియా మూవీ తెరకెక్కించడానికి రెడీ అయ్యాడు.అయితే ఏకంగా బాలీవుడ్ స్టార్ దర్శకుడు, బడా నిర్మాత సంస్థ టి-సిరీస్ ఈ సినిమా నిర్మించడాన్ని బాలీవుడ్ లో ఒక వర్గం అస్సలు సహించలేకపోతుంది.
ఈ నేపధ్యంలో ఎలా అయినా ఆది పురుష్ సినిమా రేంజ్ ని తగ్గించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.అందులో భాగంగా దీపావళి రోజున అక్షయ్ కుమార్ హీరోగా ఎనౌన్స్ అయిన రామసేత్ సినిమాని ఆది పురుష్ కి పోటీ గా ప్రాజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది.
నిజానికి రామసేత్ సోషల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమా, అయితే ఆది పురుష్ రామాయణం ఆధారణంగా తెరకెక్కుతుంది.ఈ రెండింటిని ఒకే గాడికి కట్టి బాలీవుడ్ మీడియా ఇప్పుడు ప్రచారం చేయడం గమనార్హం.