ఎంపీ పై దొంగతనం కేసు,ఇంతకీ దొంగతనం చేసింది ఏంటో తెలుసా!

సమాజ్ వాదీ పార్టీ ఎంపీ పై దొంగతనం కేసు నమోదు అయ్యింది.ఇంతకీ ఆయన దేనిని దొంగతనం చేసారో తెలుసా.

 Azam Khan Booked For Stealing Buffalo 1tstop-TeluguStop.com

ఒక గేదె ని ఎంపీ గారు దొంగ తనం చేసారు అంటూ ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.యూపీ లోని రాం పూర్ కు చెందిన ఆసిఫ్,జాకీర్ అనే ఇద్దరు వ్యక్తులు ఎంపీ అజమ్ ఖాన్ తమ గేదె ను దొంగతనం చేసారు అంటూ ఫిర్యాదు చేశారు.అనుచరులతో కలిసి 2016 అక్టోబరు 15న రాంపూర్‌లోని తన ఇంటికి వచ్చిన అజంఖాన్, అక్కడే ఉన్న గేదెను తీసుకెళ్లిపోయారని,అంతేకాకుండా రూ.25 వేల నగదును కూడా దొంగిలించారని వారు అభియోగంలో తెలిపారు.దీంతో అతడిపై కేసు నమోదు అయింది.ఆయనతో పాటు మాజీ అధికారి అలయ్‌ హసన్‌, మరో నలుగురి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరచినట్లు తెలుస్తుంది.అంతేకాకుండా మరో 40 మంది గుర్తు తెలియని వ్యక్తుల పేర్లను కూడా ఎఫ్ ఐ ఆర్ లో నమోదు చేసినట్లు సమాచారం.అయితే ఇదంతా కూడా ఒక ఇంటి స్థలం గురించి జరిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

తమ ఇంటిస్థలం తనకు కావాలంటూ ఆజమ్‌ ఖాన్‌ తన అనుచరులతో వచ్చి తమపై దాడి చేసినట్లు బాధితులు తెలిపారు.నిజానికి ఆ స్థలం తమదే అని.అందుకు తగిన రిజిస్టర్ పేపర్లు కూడా ఉన్నాయని.కానీ స్కూలు నిర్మించడం కోసం ఎంపీ తమపై ఒత్తిడి తెచ్చారని బాధితులు పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube