సమాజ్ వాదీ పార్టీ ఎంపీ పై దొంగతనం కేసు నమోదు అయ్యింది.ఇంతకీ ఆయన దేనిని దొంగతనం చేసారో తెలుసా.
ఒక గేదె ని ఎంపీ గారు దొంగ తనం చేసారు అంటూ ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.యూపీ లోని రాం పూర్ కు చెందిన ఆసిఫ్,జాకీర్ అనే ఇద్దరు వ్యక్తులు ఎంపీ అజమ్ ఖాన్ తమ గేదె ను దొంగతనం చేసారు అంటూ ఫిర్యాదు చేశారు.అనుచరులతో కలిసి 2016 అక్టోబరు 15న రాంపూర్లోని తన ఇంటికి వచ్చిన అజంఖాన్, అక్కడే ఉన్న గేదెను తీసుకెళ్లిపోయారని,అంతేకాకుండా రూ.25 వేల నగదును కూడా దొంగిలించారని వారు అభియోగంలో తెలిపారు.దీంతో అతడిపై కేసు నమోదు అయింది.ఆయనతో పాటు మాజీ అధికారి అలయ్ హసన్, మరో నలుగురి పేర్లను ఎఫ్ఐఆర్లో పొందుపరచినట్లు తెలుస్తుంది.అంతేకాకుండా మరో 40 మంది గుర్తు తెలియని వ్యక్తుల పేర్లను కూడా ఎఫ్ ఐ ఆర్ లో నమోదు చేసినట్లు సమాచారం.అయితే ఇదంతా కూడా ఒక ఇంటి స్థలం గురించి జరిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
తమ ఇంటిస్థలం తనకు కావాలంటూ ఆజమ్ ఖాన్ తన అనుచరులతో వచ్చి తమపై దాడి చేసినట్లు బాధితులు తెలిపారు.నిజానికి ఆ స్థలం తమదే అని.అందుకు తగిన రిజిస్టర్ పేపర్లు కూడా ఉన్నాయని.కానీ స్కూలు నిర్మించడం కోసం ఎంపీ తమపై ఒత్తిడి తెచ్చారని బాధితులు పేర్కొన్నారు.