గతకొంత కాలంగా టాలీవుడ్లో ఓ రీమేక్ చిత్రం గురించి పెద్దగా చర్చ జరుగుతోంది.మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన అయ్యపన్నుమ్ కొషియుమ్ అనే సినిమాను తెలుగులో ఎవరు రీమేక్ చేస్తారా అనే విషయం చాలా ఆసక్తికరంగా మారింది.
తొలుత ఈ రీమేక్లో నందమూరి బాలకృష్ణ నటిస్తాడనే వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేసింది.కానీ ఆయన ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ, యంగ్ హీరో రానా దగ్గుబాటిలతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.
ఇక ఈ సినిమా రీమేక్ రైట్స్ను సొంతం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను డైరెక్ట్ చేసేందుకు పలువురు డైరెక్టర్స్ను సంప్రదించింది.అందులో ముఖ్యంగా హరీష్ శంకర్, సుధీర్ వర్మల పేర్లు వినిపించాయి.
కానీ వారు తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ సినిమాను డైరెక్ట్ చేసే బాధ్యతలను మరో యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్రకు అప్పగించింది.ఆయన గతంలో అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు అనే సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
ఇప్పుడు ఈ సినిమాను ఆయన డైరెక్ట్ చేస్తుండగా రవితేజ్, రానాలు ఈ సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.మరి ఈ సినిమా మలయాళంలో సాధించిన విజయాన్ని ఇక్కడ కూడా రిపీట్ చేస్తుందా లేదా అనేది చూడాలి.
కాగా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో ఖచ్చితంగా హిట్ అవుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది.