అజ్ఞాతవాసి సినిమా తరువాత పవన్ పూర్తిగా రాజకీయాలకే పరిమితం కావడంతో పవన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వరని చాలామంది అభిప్రాయపడ్డారు.అయితే జనసేన పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడం, వివిధ కారణాల వల్ల పవన్ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా వచ్చే నెల నుంచి అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ సినిమాలో నటించనున్నారు.
అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం పవన్ రాంగ్ ట్రాక్ లో వెళుతున్నాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో పవన్ నటించడం తమకు ఇష్టం లేదని సోషల్ మీడియా వేదికగా పవన్ ఫ్యాన్స్ తెలియజేస్తున్నారు.అయ్యప్ప నాయర్ పాత్ర పవన్ కు సూట్ కాదని పవన్ ఇమేజ్ కు తగిన కథలను ఎంచుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.
ఈ సినిమా బదులుగా మరో సినిమా కథను ఎంచుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు ఏ మాత్రం క్రేజ్ లేని దర్శకుడు సాగర్ చంద్రను ఈ సినిమాకు ఎంపిక చేసుకోవడం కూడా ఫ్యాన్స్ ను కంగారు పెడుతోంది.పవన్ లాంటి హీరోను సాగర్ చంద్ర ఫ్యాన్స్ మెచ్చే విధంగా చూపించగలడా.? అని ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు త్రివిక్రమ్ ఈ సినిమాకు డైలాగులు రాయడంపై కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కు ఒరిజినల్ మూవీలోని డైలాగులే బాగుంటాయని.
త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ ఈ సినిమా డైలాగుల కోసం పని చేయాల్సిన అవసరం లేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.పవన్ ఫ్యాన్సే ఈ రీమేక్ పవన్ కు సూట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దర్శకుడు ఈ సినిమా కథను పవన్ కు అనుగుణంగా పూర్తిస్థాయిలో మార్పులుచేర్పులు చేశారో లేదో తెలియాల్సి ఉంది.