ప్రపంచంలోని దేశాలన్నీ కరోనా దెబ్బకు గజగజా వణికిపోతున్నాయి.అన్ని వయస్సుల వారికి సోకుతున్న ఈ వైరస్ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి త్వరగా సోకుతోంది.
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు సహజసిద్ధంగా లభించే ఆహార పదార్థాల ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.తీసుకునే ఆహారంలో శొంఠి, దాల్చిన చెక్క, మిరియాలు ఉండేలా చూసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
కేంద్రం ఇప్పటికే ఆయుష్ ప్రోటోకాల్ ను ప్రకటించి ఎవరికి వారు రోగ నిరోధక శక్తి పెంపొందించుకునేందుకు కొన్ని సూచనలు చేసింది.ఆయుష్ ప్రోటోకాల్ ప్రతిరోజూ అరగంట పాటు యోగా చేయడం, గోరు వెచ్చని లేదా నిమ్మకాయ నీటిని తీసుకోవడం, బెల్లం తిన్నడం, తక్కువ మోతాదులో చ్యవన్ వ్రాస్ తీసుకోవడం మంచిదని చెబుతోంది.
ఇవి తీసుకుంటే తక్కువ సమయంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆయుష్ ప్రోటోకాల్ సూచిస్తోంది.
తులసి, సంజీవని వటి లాంటి ఆయుర్వేద ఔషధాలు కూడా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంలో సహాయపడతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.రోజుకు రెండు సార్లు వేడి నీటిలో పసుపు వేసుకుని తాగినా శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వైద్యులు చెబుతున్నారు.వంటల్లో తరచుగా కొత్తిమీర, జీలకర్ర, పసుపు ఉపయోగించి రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.