నేటి అయోధ్య పర్యటనను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యానాథ్ రద్దు చేసుకున్నారు.రామ మందిర భూమి పూజకు సంబంధించిన ఏర్పాట్లను సీఎం యోగి పరిశీలించాల్సి ఉంది.
అయితే రాష్ట్ర మంత్రి కమలా రాణి కరోనా బారిన పడి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు.ఆమె మృతి చెందడంతో యోగి పర్యటనను రద్దు చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.
ఆగస్టు 5వ తేదీన రామ మందిర భూమి పూజ కార్యక్రమం జరగనున్న సంగతి తెలిసిందే. ఆ భూమి పూజ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు రామ జన్మ భూమిని సీఎం యోగి సందర్శించాల్సి ఉంది.
మరోవైపు హనుమన్ గారి ఆలయం, రామ్ కి పాడి కూడా సందర్శించాల్సి ఉంది.సీఎం యోగి పర్యటన రద్దు కావడంతో హనుమాన్ గారి ఆలయం వద్ద నిషన్ పూజను రద్దు చేసినట్లు రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు.
ఆదివారం జరగాల్సిన నిషన్ పూజను మంగళవారం నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు.రాముడికి సంబంధించి ఏదైనా కార్యక్రమం ప్రారంభించే ముందు హనుమంతుని నిషన్ పూజ తప్పకుండా జరపాలనే ఆచారం కొనసాగుతోందని అధికారులు తెలిపారు.