ప్రపంచంలోనే వింత ఘటన చోటుచేసుకుంది.రాబందుకు ప్రొస్టెటిక్ కాలును ఏర్పాటు చేశారు.
ఒక పక్షికి అందులోనూ రాబందుకు ఇలా చేయడం ఫస్టు టైము.ఇది వరకూ ఈ విధానాన్ని గుడ్లగూబకు నిర్వహించారు.
ఆడది అయిన రాబందుకు కాలు తీవ్రంగా గాయమైంది.దీంతో అది దెబ్బతింది.
ఆ పరిస్థితిలో ఆస్ట్రియాలో బర్డ్ ఆఫ్ ప్రీ సెంచరీ ప్రాంతానికి దానిని తీసుకెళ్లారు.రాబందుకు కాలును పరిశీలించారు.
కాలు పూర్తిగా పనిచేయలేదు.దీంతో వైద్యులు పరీక్షలు నిర్వహించి క్రుత్రిమ కాలును అమర్చేందుకు సిద్దమయ్యారు.
కాలు పూర్తిగా పనిచేయకపోవడం వల్ల ఆ స్థితిలో ఆ పక్షికి ప్రొస్థెటిక్ కాలును అమర్చి చికిత్స చేశారు.ఆ రాబందు నడవడం కోసం డాక్టర్లు ప్రత్యేకమైన ప్రొస్థెటిక్ లెగ్ ను ఏర్పాటు చేయడంతో ఆ రాబందు ఇప్పుడు ఎగరగలుగుతోంది.
కొన్నిరోజుల పాటు రాబందును పర్యవేక్షించి అది పూర్తిగా కోలుకున్న తర్వాత ఆ రాబందును తిరిగి వదిలేయనున్నారు.
వియన్నా మెడికల్ యూనివర్శిటీ పరిశోధకులు మియా కోసం శాశ్వత ప్రొస్థెటిక్ కాళ్ళను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గుడ్లగూబ లాంటి పక్షులు తేలికగా ఉండటం వలన చిన్న పక్షులలో కృత్రిమ కాళ్లను అమర్చి వాటిని బతికించడం చాలా హీజీ అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అయితే రాబందుకు ఆ చికిత్స చేయడం అంత సులభంకాదని, దీనిని పూర్తి చేయడం కష్టంతో ఓపికతో కూడుకున్న పని అని వైద్యులు తెలుపుతున్నారు.మియా శస్త్రచికిత్స చేసిన వైద్యుల బృందానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ ఆస్కార్ అజ్మాన్ గతంలో వికలాంగుల కోసం ప్రొస్థెటిక్ చేతులను కనుగొన్నారు.ఆ నిపుణుడి సూచనల మేరకు రాబందు కాలు ఎముక చివరన ప్రొస్థెటిక్ కాలు జతచేయడంతో 3 వారాల శస్త్రచికిత్స తర్వాత రాబందు తిరిగి నడవగలిగింది.6 వారాలు రాబందు తన శరీరంతో పాటు తన అడుగుల బరువును కూడా భరించిందంని, ఎట్టకేలకు రాబందు నడిచిందని వైద్యులు ఆనందం వ్యక్తం చేశారు.