తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజన్.నాలుగు వారాలు కంప్లీట్ చేసుకుని ఐదో వారానికి చేరుకుంది.
ఈ వారం నామినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యాక.కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ‘బిబి గ్రాండ్ హోటల్’ టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ హోటల్ టాస్కే నిన్న కూడా కొనసాగింది.అతిథులు.
హోటల్ స్టాఫ్తో అన్ని పనులు చేయించుకుంటూ అటు టిప్పు ఇవ్వకుండా, ఇటు స్టార్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు.మరోవైపు సీక్రెట్ టాస్క్లో భాగంగా.
హోటల్ స్టాఫ్కు స్టార్లు రాకుండా అతిథులు, హోటల్ స్టాఫ్ మధ్య చిచ్చు పెడుతున్నాడు అవినాష్.ఇక స్టార్లు ఇవ్వకపోడంతో హోటల్ స్టాఫ్ అసహనం వ్యక్తం చేయగా.
టాస్కుల్లో ఎప్పుడూ ఓవర్ యాక్షన్ చేసే కండలవీరుడు అయిన మెహబూబ్ ఈ టాస్క్లో కూడా రెచ్చిపోయాడు.ఈ క్రమంలోనే ఎవడైనా ఎక్కువ మాట్లాడితే ఒక్కొక్కడికీ పుచ్చలు పగిలిపోతాయి అని మెహబూబ్ వార్నింగ్ ఇవ్వడంతో.
హోటల్ స్టాఫ్లో ఒకరైన అఖిల్ సీరియస్ అవుతాడు.అయినప్పటికీ వెనక్కి తగ్గని మెహబూబ్.
నా జోలికి వస్తే ఎవడికైనా పుచ్చపగిలిపోద్దని మరోసారి అనడంతో అవినాష్ రంగంలోకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు.మేమూ మగాళ్లమే.
మాకు మీసాలు ఉన్నాయి.నీకు కండలు ఉన్నంత మాత్రాన ఎవడూ భయపడిపోడు.
రౌడీయిజం చూపించుకోవాలంటే ఊర్లో చూపించుకో.ఇది బిగ్ బాస్ హౌస్.
కాస్త డీసెంట్గా బిహేవ్ చేయి అంటూ క్లాస్ పీకుతాడు.
అనంతరం మిగిలిన సభ్యులందరూ కూడా మెహబూబ్దే తప్పంటూ వాదిస్తారు.
ఇక మెహబూబ్కు మొదటి నుంచి మంచి స్నేహితుడుగా ఉంటున్న సోహైల్ సైతం పుచ్చపగిలిపోతుంది అనే మాట అనకుండా ఉండాల్సిందని సీరియస్ అవుతాడు.అయితే తన తప్పు తెలుసుకున్న మెహబూబ్.
చివరకు కాళ్లబేరానికి వస్తాడు.ఈ క్రమంలోనే హోటల్ స్టాఫ్ మొత్తానికి క్షమాపణ చెప్పి.
వార్నింగ్ ఇచ్చిన అవినాష్కే వెయ్యి రూపాయిలు టిప్పు ఇస్తాడు.