టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజన్.ఐదు వారానికి కంప్లీట్ చేసుకుని ఆరో వారానికి చేరుకున్న సంగతి తెలిసిందే.
రోజు రోజుకు కొత్త కొత్త టాస్క్లతో, లవ్ ట్రాకులతో బిగ్ బాస్ హౌస్ రసవత్తరంగా, రంజుగా మారుతోంది.అయితే ఈ సీజన్లో రెండో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్.
నవ్వుతూ, నవ్విస్తూ హౌస్లోనే బెస్ట్ ఎంటర్టైనర్గా నిలుస్తున్నారు.అతడు చేసే కామెడీకి ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులకు సైతం ఫిదా అవుతున్నారు.
టాస్కుల్లో సైతం అవినాష్ ఫుల్ యాక్టివ్గా ఉంటూ.తన గేమ్ను చాలా ప్లాన్డ్గా ఆడుతున్నాడు.ఇక అమ్మాయిలతో పులిహోర కలపడం లోను ఈయన ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.హౌస్లోకి వచ్చిన మొదటల్లో మోనాల్కు బిస్కెట్లు వేసిన అవినాష్.
ప్రస్తుతం ఓవైపు దివి, మరోవైపు అరియానాతో పులిహోర కలుపుతూ హాట్ టాపిక్ అవుతున్నారు.ఇక నిన్నటి ఎపిసోడ్లో అవినాష్ ధైర్యం చేసి దివికి లెటర్ ఇచ్చేశాడు.
మొదట ఓ లెటర్ రాసిన అవినాష్.దాన్ని అమ్మ రాజశేఖర్ మాస్టర్కి ఇచ్చి దివికి ఇవ్వమని చెప్పాడు.అయితే అవినాష్ ఏం రాశాడో తెలుసుకునేందుకు లెటర్ ఓపెన్ చేసి చదివిన అమ్మ రాజశేఖర్ మాస్టర్కు మైండ్ బ్లాక్ అయింది.దీంతో వెంటనే నువ్వే ఇచ్చుకో పో అంటూ ఆ లెటర్ను అవినాష్ ముఖంపై విసిరిగొట్టాడు.
ఇక చివరకు అవినాష్ నేరుగా దివి బెడ్ దగ్గరకు వెళ్లి.ఆమె చేతికి ఇవ్వకుండా బెడ్పై లెటర్ పెట్టేసి వెనుదిరిగాడు.
లెటర్లో ఏముందా అని తెరిచి చూసిన దివి.అవినాష్ వైపు చూసి ఓ నవ్వు నవ్వేసింది.ఇంతకీ ఆ లెటర్లో ఏముందంటే.దివి, అవి ఫ్రెండ్స్ అని రాసి ఉంది.
లవ్ లెటర్ ఇస్తున్నట్టు పెద్ద సీన్ చేసిన అవినాష్.చివరకు ఫ్రెండ్షిప్ లెటర్ ఇచ్చి షాక్ ఇచ్చాడు.
మొత్తానికి తన మార్క్ కామెడీతో అందరినీ నవ్వించారు.కాగా, ఈ వారం కూడా నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్గా సాగాయి.
అభిజిత్, మోనాల్, కుమార్ సాయి, దివి, అఖిల్, నోయల్, లాస్య, హారిక, అరియానాలు నామినేషన్లో ఉండగా.ఈ వారం వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్నది ఉత్కంఠగా మారింది.