టాలీవుడ్ లో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ అవికాగోర్ ఈ సినిమా కంటే ముందుగా అవికాగోర్ హిందీలో చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకి చేరువ అయ్యింది.ఇదిలా ఉంటే ఉయ్యాల జంపాల సినిమా సూపర్ హిట్ అవ్వడంతో టాలీవుడ్ కొద్ది కాలం ఈమె హవా కొనసాగింది.
ఆ సినిమా తర్వాత సినిమా చూపిస్తా మామ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈమె క్రేజ్ మరింత పెరిగింది.దీంతో ఈ అమ్మడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోవడం పక్కా అని అందరూ అనుకున్నారు.
అయితే ఊహించని విధంగా లావు కావడంతో అవకాశాలు తగ్గిపోయాయి.ఈ కారణంగా సినిమాలకి కొంతకాలం గ్యాప్ ఇచ్చి కంప్లీట్ గా లుక్ మార్చేసి జీరో సైజ్ లోకి వచ్చేసిన అవికాగోర్ మరల టాలీవుడ్ లో తన ప్రయత్నాలు మొదలుపెట్టింది.
అయితే అనుకున్న స్థాయిలో ఈ అమ్మడుకి అవకాశాలు మాత్రం రావడం లేదు.ఏదో ఒక సినిమాలో కమిట్ అయ్యింది.ఇదిలా ఉంటే ఇప్పుడు అవికాగోర్ ఒక సినిమాలో హీరోయిన్ గా నటించడంతో పాటు ఆ సినిమా నిర్మాణ బాద్యతలు కూడా నిర్వహిస్తుంది.కొత్త హీరో సాయి రోనక్ తో జోడీగా నటిస్తూ పూర్తి స్థాయి నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతుంది.
తాజాగా ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ ఆవిష్కరించింది.ఈ సినిమాతో మురళీ నాగ శ్రీనివాస్ గంధం దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.
నిర్మాతగా మారడంపై అవికాగోర్ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చింది.ఆచార్య క్రియేషన్స్ కోసం రాసిన కథను మురళీ నాగ శ్రీనివాస్ గంధం నాకు చెప్పారు.
దర్శకుడు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది.నిర్మాతగా నా తొలి సినిమాకి ఇదే సరైన కథ అనుకున్నాను.
దాంతో అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్ని ఏర్పాటు చేశాను అని తెలిపారు.మరి నిర్మాతగా మారి తొలి తెలుగు సినిమా చేస్తున్న అవికాగోర్ కి ఎంత వరకు కలిసొస్తుందో వేచి చూడాలి.
.