జబర్దస్త్ షోలో ఈమధ్య చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.ఇప్పటికే కొంతమంది ఇక్కడ మానేసి వేరే షోకి జంప్ అవగా ఇప్పటికీ ఆ ప్రక్షాళన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయని తెలుస్తుంది.
ఒకప్పుడు ఐదారు టీం లతో కళకళలాడే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ లు ఇప్పుడు కొద్దిమందితోనే అది కూడా ఒకటి రెండు స్పెషల్ స్కిట్స్ అంటూ నడిపిస్తున్నారు.ఇదిలాఉంటే ఎక్స్ ట్రా జబర్దస్త్ లో షోలో సక్సెస్ ఫుల్ టీం అయిన సుడిగాలి సుధీర్ టీం లో కూడా కొద్దిపాటి మార్పులు జరిగినట్టు తెలుస్తుంది.
లేటెస్ట్ గా ఎక్స్ ట్రా జబర్దస్త్ టీం ప్రోమోలో సుధీర్ టీం నుండి కేవలం ఆటో రామ్ ప్రసాద్ ఒక్కడే పాల్గొన్నాడు.ఆటో రాం ప్రసాద్ మిగతా టీం మెట్స్ ని తీసుకుని స్కిట్ లాగించేశాడు.
ఎక్స్ ట్రా జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి గెస్ట్ గా వచ్చారు.సుధీర్ టీం అంటే ఇష్టం ఉన్న అనీల్ రావిపుడి సుధీర్, శ్రీను లేకుండా ఒక్కడివే ఇలా స్కిట్ చేయడం ఎలా ఉందని ఆటో రామ్ ప్రసాద్ ని అడిగారు.
రామ్ ప్రసాద్ ఆటో ఇంజిన్ లేకుండా వచ్చిందని వాళ్లిద్దరి గురించి ప్రస్థావించారు.మరి సుధీర్, శ్రీనులు నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి ఎందుకు రాలేకపోయారో ఏమో కానీ ఆ ఎఫెక్ట్ షో మీద మాత్రం బాగా పడేలా ఉందని చెప్పొచ్చు.