తెలుగు బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు వస్తుంటాయి పోతుంటాయి.అయితే గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఏమాత్రం రేటింగ్స్ పరంగా తగ్గకుండా… ఎన్ని కార్యక్రమాలు వచ్చినా వాటికి దీటుగా నిలబడి విజయవంతంగా ముందుకు సాగిపోతున్న కార్యక్రమం ఏదైనా ఉందంటే అది జబర్దస్త్ కార్యక్రమం అని చెప్పవచ్చు.
గత ఎనిమిది సంవత్సరాల నుంచి విజయవంతంగా దూసుకుపోతున్న ఈ కార్యక్రమం ద్వారా పలువురు కమెడీయన్లు తమ అద్భుతమైన పంచ్ డైలాగులతో అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు.
ఈ జబర్దస్త్ వేదికపైకి ఎంతోమంది కమెడియన్లు వచ్చి ఇండస్ట్రీలో గుర్తింపును సంపాదించుకున్నారు.
ఇలా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఆటో రాంప్రసాద్ ఒకరు.ఆటో రాంప్రసాద్ తనదైన శైలిలో పంచులు వేస్తూ ఆటో పంచుల స్పెషలిస్ట్ గా పేరు పొందాడు.
తాజాగా ఆటో రాంప్రసాద్ జబర్దస్త్ టీమ్ లీడర్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.జబర్దస్త్ లోకి వచ్చిన అమ్మాయిలతో టీమ్ లీడర్స్ ఆ విధంగా చేస్తారంటూ ఆటో రాంప్రసాద్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
సాధారణంగా ఆటో రాంప్రసాద్ సుడిగాలి సుధీర్ టీమ్ మెంబర్.అయితే తాజాగా జబర్దస్త్ కార్యక్రమానికి విడుదలైన ప్రోమోలో భాగంగా ఆటో రాంప్రసాద్ హైపర్ ఆది స్కిట్ లో గెస్ట్ గా చేశారు.రాంప్రసాద్ తో పాటు కొరియోగ్రాఫర్ పండు కూడా ఆది స్కిట్ లో గెస్ట్ గా చేశాడు.ఈ క్రమంలోనే వీరి ముగ్గురు నల్ల చొక్కాలను ధరించి స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చారు.
ఈక్రమంలోనే ఆటో రాంప్రసాద్ జబర్దస్త్ టీమ్ లీడర్ ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైపర్ ఆది స్కిట్ లో భాగంగా ముగ్గురు కలిసి ముగ్గురు అమ్మాయిలతో ఎంట్రీ ఇచ్చారు.ఓ సందర్భంలో వీరు ముగ్గురు అమ్మాయిలతో కలిసి ఉన్నప్పుడు ఆటో రాంప్రసాద్ ను ఉద్దేశించి.నిన్ను వడివేలు అనే గ్యాప్లో వాడి తడిమేస్తున్నాడు చూసావా? ఏరా చేయి తీసేయ్ అంటూ రామ్ ప్రసాద్ ను అనడంతో అప్పటివరకు అమ్మాయి పై చేయి వేసుకున్న రాంప్రసాద్ ఒక్కసారిగా చేయి తీసేస్తాడు.హైపర్ ఆది అన్న మాటలను గుర్తు చేసుకుంటూ రాంప్రసాద్ ఏది ఏమైనా జబర్దస్త్ లో టీమ్ లీడర్లకు ఎక్కువ కంఫర్ట్ ఉంటాయి .వారు అమ్మాయిలతో ఏవిధంగానైనా ప్రవర్తించవచ్చని చెప్పడంతో స్టేజిపై ఉన్నవారందరూ నవ్వుకున్నారు.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.