ప్రస్తుతం మనం జీవిస్తున్నది సమాజంలో అనడం కంటే జనారణ్యంలో అనుకునే పరిస్దితులు నెలకొన్నాయి.అడవిలో కౄరజంతువులు ఉంటాయంటారు.
కానీ వాటికంటే ఎక్కువనే జనారణ్యంలో ముసుగులు వేసుకుని తిరుగుతున్న మానవ మృగాలు ఉన్మాదంతో ఊగిపోతున్నాయి.మనషులను ఆకలేసి చంపే జంతువులను చంపుతున్న మనుషులు, జంతువుల రూపంలో వున్న మృగాలకు ఏ చికిత్స అందించి మార్చగలుగుతున్నాడనే ప్రశ్నకు సమాధానం లేదు.
చివరికి ఉరి తీసిన మార్పులేదు.
ఇకపోతే ఘట్కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో నిన్న సాయంత్రం 6.30 నిమిషాల ప్రాంతంలో కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న ఓ బీఫార్మసీ విద్యార్థినిపై ఆటో డ్రైవర్తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు అత్యాచారయత్నం చేశారు.ఆ వివరాలు చూస్తే.
రాంపల్లిలోని ఆర్ఎల్నగర్ ఓయూ కాలనీకి చెందిన యువతి కండ్లకోయలోని ఓ కాలేజీలో బీఫార్మసీ చదువుతోంది.కాగా కాలేజీకి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో నాగారంలో బస్సు దిగి రాంపల్లిలోని ఆర్ఎల్ నగర్ బస్టాప్ వెళ్లేందుకు సెవన్ సీటర్ ఆటో ఎక్కిందట.
అయితే ఆ ఆటోలో ఉన్న ఫ్యాసింజర్స్ కొద్ది దూరం వెళ్లాక దిగిపోగా బాధితురాలు మాత్రమే ఆటోలో ఉందట.అంతే ఆ డ్రైవర్ మృగానికి చెడూ అలోచన రావడంతో ఆమె దిగాల్సిన చోట ఆపకుండా వేగంగా ముందుకు తీసుకెళ్లాడట.ఈ విషయాన్ని ఆయువతి తన తల్లికి ఫోన్ చేసి చెప్పగా, వారు 100 కు డయల్ చేసి పోలీసులకు విషయాన్ని చేరవేయడంతో అలర్ట్ అయిన కీసర, ఘట్కేసర్ పోలీసులు బృందాలుగా ఏర్పడి ఆయా ప్రాంతాల్లో జల్లెడ పట్టారు.
ఈ క్రమంలో బాధితురాలి ఫోన్ నంబర్ లొకేషన్ను ట్రేస్ చేయడంతో చివరికి ఘట్కేసర్ ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్ సర్వీసు రోడ్డుకు సమీపంలో నిర్మాణం ఆగిపోయిన ఓ భవనం వద్ద చూపింది.
వెంటనే అక్కడికి పోలీసులు చేరుకునే లోపలే నిందితులు పారిపోయారట.ఇక కేసు నమోదు చేసుకొన్న పోలీసులు ఈ మృగాలను వెతికే పనిలో పడ్డారు.
తాజా వార్తలు