అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై అమెరికా మహిళ కోర్టు లో దావా వేయనున్నట్లుగా తెలుస్తోంది .తనకు న్యాయం చేయాలని, ట్రంప్ తనపై అత్యాచారం చేశాడని అప్పటి నుంచీ మానసికంగా తాను ఎంతో కుంగిపోయాయని ఆమెతన లాయర్ ద్వారా కోర్టుకు విన్నవించుకొనుందట.
ఈ క్రమంలోనే ఆమె తరపు న్యాయవాది ట్రంప్ కు కోర్టు ద్వారా దావా నోటీసు పంపేందుకు సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది.ఇంతకీ ఎవరీ మహిళ ట్రంప్ కు ఆమెకు ఉన్న సంభంధం ఏంటి అనే వివరాలలోకి వెళ్తే.
మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టుగా అసలే రహస్య పత్రాల దొంగతనం, ఆ కేసు, ఈ కేసు అంటూ సమస్యలన్నీ ట్రంప్ ను చుట్టుముట్టిన తరుణంలో కొత్తగా అత్యాచార కేసు ట్రంప్ మెడకు చుట్టుకోవడంతో ఇంటా బయటా ట్రంప్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ట్రంప్ తనపై అత్యాచారం చేశారని జీన్ కారోల్ అనే మహిళ సంచలన ఆరోపణలు చేస్తూ న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించడంతో ట్రంప్ వర్గం ఒక్క సారిగా షాక్ అయ్యింది.
గతంలో కూడా ట్రంప్ పై అత్యాచార ఆరోపణలు ఎన్నో వచ్చాయి.ట్రంప్ వయసులో ఉండగా ఎంతో మందిపై అత్యాచారాలు చేశాడంటూ ఎన్నికల సమయంలో ఆరోపణలు వచ్చినా అవన్నీ రాజకీయ కుట్రలుగా కొట్టి పారేశారు కానీ తాజాగా.
ట్రంప్ తనను 1996 సంవత్సరంలో మిడ్ టౌన్ మాన్ హాటన్ లోని ఓ డిపార్ట్మెంట్ స్టోర్ లో అత్యంత కిరాతకంగా బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడని అప్పటి నుంచీ తాను ఎంతో మానసికంగా కుంగిపోయానని తన లాయర్ ద్వారా కోర్టును ఆశ్రయించింది.అయితే ఈ ఆరోపణలపై ట్రంప్ స్పందించారు.కారోల్ పై తాను ఎలాంటి అత్యాచారానికి పాల్పడలేదని తన పుస్తకాన్ని విక్రయించుకునే క్రమంలో ఆమె ఈ విధంగా ఆరోపణలు చేస్తోందని అన్నారు.కాగా ఆధారాలను సేకరించాలని తన క్లైంట్ కారోల్ కు న్యాయం చేయాలని త్వరలో కోర్టులో ఆమె తరపు లాయర్ పిటిషన్ వేయనున్నట్టుగా తెలుస్తోంది.
.తాజా వార్తలు