బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పేరు చెబితే లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ తో పాటు ఎక్కువగా వివాదాలు గుర్తుకొస్తాయి.బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు అందరితో ఆమె ఏదో ఒక రూపంలో కయ్యం పెట్టుకుంది.
స్టార్ హీరోయిన్ గా ఉన్న కూడా బాలీవుడ్ లో చాలా మంది ఆమెతో కలిసి పనిచేయడానికి ఇష్టపడరు.దానికి కారణం ఆమె ప్రవర్తన.
ఏదో ఒక కారణంతో ఎప్పుడూ ఎవరో ఒకరిని కంగనా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూనే ఉంటుంది.మరో వైపు ఈ మధ్య మహారాష్ట్రలో శివసేన సర్కార్ తో కూడా గొడవలు పెట్టుకుంది.
అలాగే ఆమె సినిమాల విషయంలో కూడా ఎక్కువగా వివాదాలకి గురవుతుంది.మణికర్ణిక విషయంలో క్రిష్ తో కంగనా జగడం పెట్టుకుంది.
ఆ సినిమా దర్శకత్వం నుంచి క్రిష్ ని అర్ధంతరంగా తప్పించే తానే దర్శకురాలిగా మారిపోయింది.ఇప్పుడు మణికర్ణికకి సీక్వెల్ సినిమాని ఆమె తాజాగా ఎనౌన్స్ చేసింది.
కాశ్మీర్ మహారాణి దిద్దా పాత్రలో నటించడానికి రెడీ అయ్యింది.దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా చేసింది.అయితే ఇప్పుడు ఓ రచయిత దీనిపై కంగనాకి లీగల్ నోటీసులు జారీ చేశారు.రచయిత ఆశిష్ కౌల్ కంగనా రనౌత్ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపించారు.
చరిత్రలో దిడ్డ గురించి పెద్దగా వ్రాయబడలేదని, రనౌత్ తన కొత్త చిత్రం కథను తన దిడ్డా: కాశ్మీర్ కి యోధ రాణి అనే పుస్తకంపై ఆధారపడ్డారని కౌల్ అన్నారు.గత ఏడాది సెప్టెంబర్లో పుస్తకం యొక్క హిందీ వెర్షన్కు ముందుమాట రాయడానికి రణౌత్ను సంప్రదించినట్లు కౌల్ పేర్కొన్నారు.
కథ మొత్తం ఆమెకు ఇచ్చి నేను ఆమెకు ఒక మెయిల్ రాశాను.ఆమె ముందుమాట కోసం పుస్తకాన్ని చదివారా అని నేను ఆమెను అడిగాను, అప్పుడు సినిమా గురించి మాట్లాడలేదు.
ఆమె కథ గురించి ఏమి చెప్పినా నా పుస్తకంలో మాత్రమే లభిస్తుంది.నా పుస్తకం ఆధారంగా సినిమా చేయాలనుకుంటున్నపుడు ఆమె నన్ను అడగాలి.
కాని ఆమె నన్ను సంప్రదించలేదు “అని కౌల్ చెప్పారు.నా హక్కులను పరిరక్షించడానికి నేను ఏమైనా చేస్తాను అని ఆయన పేర్కొన్నారు.
మరి దీనిపై కంగనా ఎలా రియాక్ట్ అవుతుందనేది వేచి చూడాలి.