కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఈ వైరస్ సోకి ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగా 90వేల మంది చనిపోగా లక్షలాది మంది ప్రజలు హాస్పటల్స్ లో చికిత్స పొందుతున్నారు.
అయితే స్థానికంగా ఉన్న వారికి ఈ పరిస్థుతులు ఎదుర్కునే ధైర్యం ఎంతో కొంత ఉంటుంది కానీ దేశం కాని దేశంలో ఉండే వారికి ఇలాంటి పరిస్థితులు ఎదురైతే వారి పరిస్థితి ఎంతో దయనీయంగా మారిపోతుంది.ఇలాంటి పరిస్థితీ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో భారతీయులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
వివిధ దేశాలలో స్థిరపడిన ఎంతో మంది ఎన్నారైలు, చదువులు కోసం వెళ్ళిన విద్యార్ధులు ఇలా చాలా మంది ఆర్దిక ఇబ్బందులతో పాటు మానసికంగా కూడా నష్టపోతున్నారు.ఈ క్రమంలో ఆస్ట్రేలియా లో ఉంటున్న ఎన్నారై విద్యార్ధులకి ఆస్ట్రేలియా తెలంగాణా అసోసియేషన్ (ATA ) మేమున్నామని భరోసా ఇచ్చింది.
ఆస్ట్రేలియా లో సైతం లాక్ డౌన్ జరుగుతున్న నేపధ్యంలో స్థానికంగా ఉన్న విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు.
నిత్యావసర సరుకులు దొరకక పోవడంతో పాటు మంచి నీటిని సైతం క్యూలో నుంచుని తెచ్చుకోవాల్సిన పరిస్థతి ఏర్పడింది.
దాంతో ఈ విషయం తెలుసుకున్న ఆస్ట్రేలియా తెలంగాణా అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ బైరెడ్డి విద్యార్ధులకి సరుకులు అందచేసి వారికి తోడుగా నిలిచారు.ఎటువంటి అవసరం వచ్చినా సరే తమని సంప్రదించమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు అందరూ పాల్గొన్నారు.