ఇండియాలో పెళ్లి తర్వాత భార్య, భర్తల మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు ఉన్న తప్పని సరి పరిస్థితిలో మహిళలు కలిసి బ్రతుకుతారు.ఇష్టం లేకపోయినా అతనితో జీవితం అనుకుంటారు.
కొంత మంది మహిళలు, మగవాళ్ళు, పెళ్లి తర్వాత వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు.ఇవి ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
భార్య లేదా భర్త వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు అంటే సమాజం వారిని చాలా నీచంగా చూస్తుంది.
అయితే విదేశాలలో భార్య, భర్తల రిలేషన్ ఎంత వేగంగా సెట్ అవుతుందో, అంతే వేగంగా విచ్చిన్నం అవుతుంది.
ఇద్దరి మధ్య అనుబంధం అంతగా లేనపుడు కలిసి జీవితాంతం ఇష్టం లేకుండా బ్రతకడం అనవసరం అనేది విదేశీయలు భావన.ఈ కారణంగానే అక్కడ విడాకులు తీసుకునే జంటలు ఎక్కువగా ఉంటాయి.
అయితే తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన నడియా బొకోడీ అనే మహిళా తన ఏడేళ్ళ ఏడేళ్ల వివాహ బంధంకి మనస్పర్థలతో ముగింపు చెప్పుకుంది.
ఆ తరువాత ఆమె డిప్రెషన్లోకి వెళ్లిపోవడంతో దాని నుంచి బయటకి రావాలని ఆలోచించింది.దీని కోసం ఒక వింత ప్రయోగం చేసింది.ఏడుగురు వేర్వేరు పురుషులతో వరుసగా ఏడు రోజుల పాటు వన్ నైట్ స్టాండ్స్ చేయడానికి నడియా సిద్ధం అయ్యింది.
తాను చేసిన ఈ ప్రయోగానికి రెయిన్ బో అని ముద్దు పేరు పెట్టుకుంది.నదియా తీవ్ర ఒత్తిడి నుంచి బయటపడేందుకు వరుసగా ఏడుగురు బాయ్ ఫ్రెండ్స్ తో వన్ నైట్ స్టాండ్స్ మొదలెట్టిన తర్వాత ఆమె ఒత్తిడి నెమ్మదిగా దూరం అవుతూ వచ్చింది.
ఒక్కో రోజు ఒక్కో బాయ్ ఫ్రెండ్తో గడపడం తనకు కొత్త అనుభూతి ఇచ్చినట్లు తెలిపిన ఆమె ఈ రెయిన్ బో ప్రయోగంతో ఏడేళ్ల వివాహ బంధం నుంచి విడిపోయిన బాధ మరిచిపోయినట్లు తెలిపింది.ఆమె తాను ఈ రెయిన్ బో అనే ప్రయోగంతో చేసిన ప్రయత్నం గురించి ఆస్ట్రేలియాకు చెందిన ఒక రేడియో ప్రోగ్రామ్లో పంచుకుంది.