తాజాగా ఖతార్ విమానాశ్రయంలో ఓ దారుణమైన సంఘటన జరిగింది.ఎయిర్ పోర్ట్ లో అప్పుడే పుట్టిన నవజాతి శిశువును ఎవరో అక్కడే వదిలేసి వెళ్లారు.
అయితే ఆ శిశువు జననం విమానాశ్రయం లోనే అప్పుడే ప్రసవించి అక్కడే వదిలేసి వెళ్లాలని ఆ విమానాశ్రయంలో అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.అయితే అందుకు గాను ఆ సమయంలో ఖతార్ నుండి ఆస్ట్రేలియా దేశం సిడ్నీ నగరానికి వెళుతున్న విమానాన్ని ఆపి అందులో ఉన్న మహిళలను దింపి వైద్యులు వారిని పరీక్షించారు.
ఇందుకోసం వారిని గంటల తరబడి ఆపేశారు. ఇకపోతే ఈ విషయం సంబంధించి ఆస్ట్రేలియా దేశం ఖాతర్ విమానాశ్రయ అధికారుల పై తీవ్రంగా స్పందించింది.
గత శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో ఖాతర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఆస్ట్రేలియా దేశం లోని సిడ్నీకి బయలుదేరి వెళ్లాల్సిన ఈ సమయంలో ఎయిర్ పోర్ట్ లోని మరుగుదొడ్డిలో నవజాత శిశువు అని అధికారులు కనుగొన్నారు.అయితే ఇందుకు సంబంధించి ఆ విమానంలో ఉన్న మహిళ నుంచి వారికి గర్భానికి సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఇకపోతే ఆ విమానంలో మొత్తం 34 మంది ప్రయాణికులు ఉండగా వారిలో మొత్తం 10 మంది మహిళలను విమానాశ్రయ అధికారులు దింపి ఆ తర్వాత వారిని పూర్తిగా లేడీ డాక్టర్స్ సమక్షంలో వివస్త్రలను చేసి పరీక్షలు నిర్వహించినట్లు విమానంలోని ప్రయాణికులు వాపోయారు.అయితే ఆ పరీక్షల తర్వాత మహిళలు చాలా కలత చెందారని ఆ విమానం లోకి వచ్చిన తర్వాత ఓ మహిళ ఏడుపు ప్రారంభించినట్టు కొందరు ప్రయాణికులు వెల్లడించారు.
ఈ విషయాన్ని ఆస్ట్రేలియా అధికారులు అనాగరిక చర్య తో పోల్చారు.అయితే ఈ విషయంపై ఆస్ట్రేలియా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయాల్సి ఉంది.
మహిళల పై ఖతార్ అధికారులు చేసిన చర్యలు పూర్తిగా తప్పు అని ప్రభుత్వం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆస్ట్రేలియా నిందించింది.దీంతో ఆ విమానాశ్రయాలు అథారిటీ అధికారుల పై ఓ లేఖను విడుదల చేసింది.
అయితే ఈ విషయం సంబంధించి ఏ ప్రయాణికుడు ఎటువంటి ఫిర్యాదు చేయలేదని దీంతో ప్రస్తుతం ఆ కేసు పై దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.