ప్రపంచాన్ని ప్రమాదం అంచుల్లోకి తీసుకెళ్లుతున్న కరోనా ఎలా పుట్టింది అనే విషయం ఇప్పటికి రహస్యంగానే ఉంది.కానీ కొందరు మాత్రం చైనా దేశమే కరోనా వైరస్ పుట్టుకకు కారణం అనే ఆరోపణలను బలంగా వినిపించారు.
ఇదంతా గత సంవత్సరం జరిగిన ముచ్చట.ఆ తర్వాత అందరు ఈ విషయాన్ని మరచిపోయారు.
కానీ తాజాగా మరోసారి ఈ వైరస్ అంశం తెరపైకి వచ్చింది.
ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించేందుకు చైనా కృత్రిమంగా తయారుచేసిన జీవాయుధమే కరోనా వైరస్ అని ఈ మహమ్మారి పై వీకెండ్ ఆస్ట్రేలియన్ పత్రికలో ప్రచురితమైన ఓ కథనం ప్రస్తుతం కలకలం రేపుతోంది.
ఈ విషయంలో చైనాపై ఉన్న అనుమానాలు నిజమేనని ఈ కథనం చెబుతోంది.
కాగా చైనా మూడో ప్రపంచ యుద్ధంలో జీవాయుధంగా ఉపయోగించేందుకు ఈ వైరస్ను అభివృద్ధి చేసిందని, ఇందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని ఈ పత్రిక రాసుకొచ్చింది.
దీనికి సంబంధించి 2015లో చైనా శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు రూపొందించిన ఓ నివేదిక తాజాగా వెలుగులోకి రావడం తో ప్రపంచవ్యాప్తంగా ఈ కధనం తీవ్ర చర్చనీయాంశమైంది.
అయితే బయటి సంస్థలు దర్యాప్తు జరిపితే వైరస్ మూలాల గుట్టు ఎక్కడ బయటపడిపోతుందోననే ఉద్దేశంతోనే బయటి సంస్థల దర్యాప్తును చైనా వ్యతిరేకించిందని పత్రిక పేర్కొంది.
ఈ వినాశనానికి మూలం తామే అనే నిజాన్ని దాచీ ప్రపంచాన్ని నమ్మించేందుకు ప్రయత్నాలు చేస్తుందని ఈ పత్రిక పేర్కొందట.