ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ మృత్యు ఘంటికలు మోగిస్తున్న సంగతి తెలిసిందే.చాపకింద నీరులాగా ఒక్కసారిగా విజృంభిస్తుండడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రపంచ దేశాలు ఇండియా లో పరిస్థితిని చూసి నోరెళ్లబెడుతున్నాయి.
కారణం రోజుకి లక్షలలో కొత్త కేసులు.బయటపడటంతో కరోనా బారిన పడిన వారు ఆక్సిజన్ కొరతతో పాటు.
సకాలంలో వైద్యం అందక ప్రాణాలు విడుస్తున్నారు.ఎక్కువగా ఆక్సిజన్ అందక దేశంలో చాలామంది కరోనా బారిన పడిన వారు ప్రాణాలు విడిచి ఉండటంతో ప్రపంచంలో మిగతా దేశాలు భారతీయులను కాపాడటానికి ముందుకు వస్తూ ఉన్నాయి.
ఇటువంటి కీలక తరుణంలో తాజాగా ఆస్ట్రేలియా దేశం ఇండియాలో ఆక్సిజన్ కొరత తీర్చడానికి బిగ్ హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చింది.మేటర్ లోకి వెళ్తే ఇండియాకి 100 ఆక్సిజన్ ట్యాంకర్లు, 3 వేల వెంటిలేటర్లు అందిస్తామని ఆస్ట్రేలియా ప్రకటించింది.
కరోనా వైరస్ వచ్చిన ప్రారంభ సమయంలో ఆస్ట్రేలియా ని ఇండియా అనేక రైతులకు ఆదుకోవడం జరిగిందని ఇప్పుడు దానికి రుణంగా ఇండియా తో కలసి కరోనాతో పోరాడటానికి ఆస్ట్రేలియా అన్ని రీతులుగా సహాయం చేయటానికి రెడీగా ఉందని ఆ దేశ అధికారులు ప్రకటించారు.
.