బహుశా, మాకు ధోనీ లాంటి ఆటగాడు ఉంటే ఓ కంప్లీట్ టీమ్ ఉన్న ఫీలింగ్ కలిగేది, దురదృష్టవశాత్తూ అలాంటి వారు మాకు లేరు.ఎంతైనా భారతీయులు అదృష్టవంతులు.
అలాంటివాడు మాకుంటేనా.మమ్మల్ని ఇంకెవరూ ఆపేవారేకాదు.
ఇంతకీ ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా…? సాక్షాత్తూ ఆస్ట్రేలియా అంది.అవును.
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ అయినటువంటి ‘ప్యాట్ కమ్మిన్స్‘ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇంతకీ విషయం ఏమిటంటే…ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా టి 20 మ్యాచ్ ఓడి పోయిన తర్వాత ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ అత్యంత ఘోరంగా విఫలం అవ్వడంతో కమ్మిన్స్.“తమకు టీం ఇండియా మాజీ కెప్టెన్ అయినటువంటి మహేంద్ర సింగ్ ధోనీ లాంటి మంచి ఫినిషర్ ఉంటే కథ వేరేలా ఉండేది.” అని అన్నాడు.ఇక తాను మాట్లాడుతూ… ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఆటగాడు ధోని అని అభివర్ణించాడు.అందువలనే అతను 400 వన్డే మ్యాచ్ లను సునాయాసంగా ఆడగలిగాడు అని ధోనీని కమ్మిన్స్ ఆకాశానికెత్తేశారు.
ఇకపోతే.సదరు టి 20 మ్యాచ్ లో ఆస్ట్రేలియాకు 9 వికెట్ల తేడాతో 35 బంతుల్లో 39 పరుగులు అవసరం అయ్యాయి.కాకపోతే, ఆ టార్గెట్ ఆస్ట్రేలియా జట్టు చేధించలేక ఓడిపోయింది.టీం లోని కీలక ఆటగాడు ‘మార్కస్ స్టోయినిస్’ చివరి ఓవర్ లో 15 పరుగులు చేయలేకపోయాడు.
అయితే ‘మార్కస్ స్టోయినిస్’ గత బిగ్ బాస్ లీగ్ సీజన్ లో మెల్బోర్న్ స్టార్స్ తరుపున మంచి ఆటనే ప్రదర్శించాడు.ఏకంగా 705 పరుగులు చేసి బిగ్ బాస్ లీగ్ లో విజయ దుందుభి మోగించాడు.
కానీ, నేటి అతని పేలవమైన ఆట తీరుపై అభిమానులు గుర్రుగా వున్నారు.