నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే అనేక రకాల సమస్యలకు శాస్త్రాలు, పురాణాలు పరిష్కారాలను చెబుతున్నాయి.ఆర్థిక సమస్యలు, వివాహ సమస్యలు, దంపతుల మధ్య సమస్యలు, కుటుంబ కలహాలు.
ఇలా ఎలాంటి సమస్యకు అయినా మనకు పరిష్కారం దొరుకుతుంది.దీంతో జీవితంలో మనకు ఎదురయ్యే అవరోధాలను అధిగమించి సక్సెస్ను సాధించవచ్చు.
అయితే ఇలా మనకు విజయాన్ని అందించడంలో వినాయకుడు ముఖ్య పాత్ర పోషిస్తాడు.అందుకే ఆయన ప్రతిరూపమైన ఏనుగును హిందువులు దైవంగా భావిస్తారు.
ఏనుగును వారు పూజిస్తారు.
అయితే కేవలం ఏనుగు మాత్రమే కాదు, ఏనుగు బొమ్మను ఇంట్లో లేదా ఆఫీసులో పెట్టుకున్నా విజయం సాధించవచ్చట.కానీ ఆ బొమ్మ వెండితో చేసినది అయి ఉండాలి.సైజ్తో సంబంధం లేకుండా ఎలాంటి సైజ్లో ఉన్న వెండి ఏనుగు బొమ్మనైనా ఎవరైనా ఇంట్లో పెట్టుకోవచ్చు.
లేదంటే ఆఫీసులో పెట్టుకోవచ్చు.ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు పోతాయట.
అన్ని సమస్యలు పరిష్కారం అయి, కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకుండా ఉంటాయట.
అయితే వెండి ఏనుగు బొమ్మను ఇంట్లో ఉత్తరం దిక్కున పెట్టుకోవాలి.వెండి ఏనుగు బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే వాస్తు దోషాలు కూడా పోతాయట.దీంతో ఇంటి సభ్యులకు ఎదురయ్యే అని సమస్యలు తొలగిపోయి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట.
అలాగే వెండి ఏనుగు బొమ్మను ఆఫీసులో పెట్టుకుంటే ఉద్యోగం పరంగా ఉండే సమస్యలు పోతాయని, ఉన్నతస్థాయికి చేరుకోవచ్చని వాస్తు శాస్త్రం చెబుతోంది.వెండి ఏనుగు బొమ్మ వల్ల ఆర్థిక సమస్యలు పోయి లక్ష్మీ దేవి కటాక్షం కలుగుతుందట.!
.