మొన్న జరిగిన ఒలింపిక్స్లో చాలామంది పతకాలు సాధించిన సంగతి తెలిసిందే.కాగా మొన్న ప్రధాని మోదీ బర్త్ డే సందర్భంగా ఆయనకు వచ్చినటువంటి బహుమతులను అధికారులు శుక్రవారం వేలం వేశారు.
అయితే ఇందులో ప్రధానంగా టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్ లో ఇండియాకు పతకాలు తీసుకువచ్చిన వారు ఉపయోగించిన వాటికే విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.ఇక వస్తువులతో పాటు వారు వేసుకున్న దుస్తులు కూడా వేలానికి ఉంచారు.
ఇక ఒలంపిక్స్లో పోటీ పడ్డ ఫెన్సింగ్ ప్లేయర్ అయిన భవానీ దేవి ఉపయోగించిన కత్తికి విశేషమైన ఆదరణ వస్తోందని చెబుతున్నారు.
ఇక ఆమె వాడిన కత్తి ఇప్పటికే రూ.10 కోట్ల మార్కును క్రాస్ చేసంది.ఇక దాంతో పాటు పారాలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన షట్లర్ కృష్ణ నాగర్, ఇంకో షట్లర్ అయిన సుహాస్ యతిరాజ్ లు వాడినటువంటి రాకెట్ లను వేలంలో ఉంచగా వాటికి కూడా విపరీతమైన ఆదరన దక్కింది.ఏకంగా రూ.10 కోట్ల మార్కు చేరుకున్నాయి.ఇకపోతే టోక్యో ఒలింపిక్స్ లోనే సంచలనం సృష్టించి దేశానికి తొలి, ఈ విభాగంలో ఏకైక స్వర్ణం పతకం తీసుకువచ్చిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఎంత ఫేమస్ అయ్యాడో అందరికీ తెలిసింందే.
కాగా ఆయన ఉపయోగించినటువంటి జావెలిన్ ఈటెను కూడ ఈ-వేలంలో ఉంచగా దాని బేస్ ధర రూ.కోటి దగ్గర మొదలయినా కూడా అది ఎంతో ఆదరణ దక్కించుకుంది.ఇప్పటికే రూ.10కోట్ల మార్కును క్రాస్ చేసి దూసుకుపోతోంది.ఇంకా వీటికి వేలం కొనసాగుతూనే ఉంది.ఇకపోతే పీవీ సింధు ఈ ఒలపింక్స్లో వాడినటువంటి రాకెట్ కు రూ.80లక్షల దగ్గర బేస్ ధర స్టార్ట్ కాగా.ఇప్పటికే ఆమె రాకెట్కు రూ.9 కోట్ల మార్కు వచ్చి పడింది.ఇక ఈ వస్తువుల వేలం వచ్చే నెల 7వరకు కొనసాగనుందని అధికారులు వెల్లడిస్తున్నారు.