మహిళలను భద్రత లేకుండా పోతుంది.కరోనా వైరస్ సోకినా భయం లేకుండా కామంతో కళ్లు మూసుకుపోతున్నాయి.
వైరస్ సోకిన బాధితురాళ్లపై అత్యాచారానికి ఒడిగడుతున్నారు.గతంలో ఓ అంబులెన్స్ డైవర్ కరోనా బాధితురాలిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేయగా.
ఇంకో వ్యక్తి ఏకంగా ఆస్పత్రిలోనే బాధితురాలిపై కన్నేశాడు.మసాజ్ పేరుతో పేషంట్ పై లైంగిక దాడికి దిగాడు ఓ కాంట్రాక్ట్ సిబ్బంది.
కరోనా బాధితురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో చోటు చేసుకుంది.నాంపల్లికి చెందిన ఓ యువతి కరోనా బారిన పడింది.
దీంతో ఆ యువతి చికిత్స నిమిత్తం ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో జాయిన్ అయింది.అదే ఆస్పత్రిలో కాంట్రాక్ట్ సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి ఆ యువతిపై కన్నేశాడు.
అర్ధరాత్రి వేళ యువతి ఉన్న గదికి వెళ్లి జండూబాయ్ తో మసాజ్ చేస్తానని చెప్పి లైగింక దాడికి యత్నించాడు.దీంతో ఆ యువతి గట్టిగా కేకలు వేయడంతో ఆస్పత్రి సిబ్బంది, రోగుల సహాయకులు అక్కడికి చేరుకున్నారు.
యువతి అధికారులకు జరిగిన విషయం తెలిపింది.కాగా, ఆ వ్యక్తిపై గతంలోనూ యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి.
దీంతో ఆ కామాంధుడిపై ఆస్పత్రి సిబ్బంది కఠిన చర్యలు తీసుకున్నారు.