ఏపీలో రాజకీయ వర్గాల మధ్య జరుగుతున్న పోరుకు అంతం లేనట్లుగా తెలుస్తుంది.ఎందుకంటే ముఖ్యంగా రెండు పార్టీల నేతల మధ్య ఏదో ఒక విషయంలో మాటల యుద్దాలు జరగడమే కాదు, పరస్పరం దాడి చేసుకునే వరకు కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.
ఎందుకు దాడి చేస్తారో, ఎవరి మీద ఎప్పుడు దాడి చేస్తారో మాత్రం తెలియదు.ఇకపోతే తాజాగా విశాఖపట్టణం 77వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ బట్టు సూర్యకుమారి పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన కలకలం సృష్టిస్తుంది.
కాగా నిన్న సూర్యకుమారికి అప్పికొండలో అభినందన సభ ఏర్పాటు చేశారు.అయితే ఈ సభకు హాజరైన కార్పొరేటర్ సభ అనంతరం తన ఇంటికి కారులో బయలుదేరారు.
ఈ క్రమంలో ఆమె కారు పాలవలస సమీపంలోని గొలెందిబ్బ జీడి తోటల ప్రాంతం నుండి ప్రయాణిస్తున్న క్రమంలో సడెన్గా ఇద్దరు యువకులు రోడ్డుపైకి వచ్చి కారు పై మద్యం సీసాలతో దాడిచేశారట.
అయితే కారు వెనకాలే వస్తున్న వైసీపీ కార్యకర్తలు ఈ దాడిని అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం ఏం జరగలేదని సమాచారం.
ఇక ఈ ఘటన పై విచారణ జరుపుతున్న పోలీసులు దాడిచేసిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నామని తెలిపారట.