భారత సైనికులు రహస్య స్థావరాలపై దాడి చేశారు.అక్కడ దొరికిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
జమ్ము కశ్మీర్ రాష్ట్రంలోని బారాముల్లా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.రామ్ పూర్ సెక్టార్ లో ఆగస్టు 30వ తేదీన (గత ఆదివారం) కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సమాచారం వచ్చింది.
దీంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన భారత ఆర్మీ సెక్టార్ ఏరియాను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించారు.
రామ్ పూర్ సెక్టార్ లో సుమారుగా 7 గంటల పాటు సెర్చ్ ఆపరేషన్ ను నిర్వహించారు.
అక్కడ రెండు రహస్య స్థావరాలను కనిపెట్టారు.మొదటి స్థావరంలో ఐదు ఏకే సిరీస్ రైఫిల్స్, ఆరు పిస్తోళ్లు, 21 గ్రెనేడ్లు, రెండు యూజీబీఎల్ గ్రెనేడ్లు, రెండు కెన్ వుడ్ రేడియో సెట్లను స్వాధీన పర్చుకున్నారు.
మరో రహస్య స్థావరంలో ఆరు మేగజైన్లు, 1254 రౌండ్లకు సరిపడా పేలుడు పదార్థాలు, గన్స్, పిస్తోల్స్ కు సంబంధించిన ఆరు మేగజైన్లు, ఆరు రౌండ్లు ఈ స్థావరాల్లో లభించాయి.ఈ మేరకు దొరికిన ఆయుదాలను జవాన్లు అక్కడి నుంచి తరలించారు.
అయితే ఈ ప్రాంతంలో ఆయుధాలతో ఎవరు చొరబడి ఉంటారనే దానిపై క్లారిటీ లేదు.భారత ఆర్మీ మాత్రం సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పాకిస్థాన్ గ్రామస్థులు భారత భూభాగంలో చొరబడి నిఘా వేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.