అమెరికాలో మళ్ళీ భారతీయులపై దాడులు గతంలో చాలా తీవ్రంగా జరిగేవి.ఒక సంవత్సర కాలం క్రితం జరిగిన ఒక దాడి ఘటనకి సంభందించని కేసులో ఇప్పుడు ఓ అమెరికన్ కి 15 నెలల జైలు శిక్ష పడింది.
ఆ వివరాలలోకి వెళ్తే.
గతేడాది డిసెంబర్లో అమెరికాలో టాక్సీ డ్రైవర్గా పని చేస్తున్న భారత సంతతికి చెందిన 53 ఏళ్ల స్వర్ణ సింగ్ అనే వ్యక్తిపై రోరీ బెనన్స్ అనే వ్యక్తి అతి తీవ్రంగా దాడి చేశాడు.
భారతీయ వ్యక్తి సింగ్ నడుపుతున్న టాక్సీలో ప్రయాణిస్తున్న బెనన్స్ ఈ దాడికి పాల్పడ్డాడు.ముందుగా దుస్తులతో ఊపిరాడకుండా ముఖానికి చుట్టేద్దామని అనుకున్నాడు కాని, కారు దిగి పారిపోతున్న సింగ్ ని వెంబడించి మరీ సుత్తి తో అతి క్రూరంగా గాయపరిచాడు.
సుత్తితో తలపై గడ్డిగా కొట్టడంతో సింగ్ కపాలానికి తీవ్రమైన గాయం అయ్యింది.సింగ్ కోలుకోవదానికే ఎంతో సమయం పట్టింది కూడా అయితే ఈ దారుణం జరిగిన తరువాత అంటే దాదాపు సంవత్సరం తర్వాత బెనన్స్ దోషిగా తేలడంతో 15 నెలల జైలు శిక్ష విదిస్తున్నట్టుగా సియాటెల్లోని కోర్టు తీర్పును ప్రకటించింది.