అమెరికాలో ఘోరం జరిగింది…మహాశివరాత్రి పర్వదినం పుణ్యమా అంటూ హిందువులకు బాద కలిగించింది.అసలే జరిగిందంటే.
అమెరికాలోని ఓ హిందూ దేవాలయంపై గుర్తుతెలియన దుండగులు దాడి చేశారు.ఆలయాన్ని ధ్వంసం చేశారు.
ఆలయం గోడపై అనుచిత వ్యాఖ్యలు రాశారు.స్వస్థిక్ గుర్తుతో పాటు గెట్ అవుట్ అన్న రాతలు కనిపించాయి.
మత విద్వేషాలు రగిల్చే వ్యాఖ్యలు రాశారు.రెండు దశాబ్ధాలుగా అతిపెద్ద ఆలయంగా విరాజిల్లుతున్న దేవాలయంపై దాడి జరగడం సంచలనం సృష్టించింది.
మహాశివరాత్రి పండుగకు ముందు రోజు ఈ ఘటన జరగడం హిందువులను తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహానికి గురి చేసింది.సీటెల్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో గల హిందూ దేవాలయంపై ఈ దాడి శనివారం జరిగింది.
స్నోహోమిష్ కంట్రీ షరీఫ్ విభాగం ఘటనపై విచారణకు ఆదేశించింది.ఉన్నతాధికారులు ఆదివారం సంఘటనాస్థలాన్ని సందర్శించారు.
ఇలాంటి ఘటన అమెరికాలో ఎన్నడూ జరగలేదని దేవాలయ బోర్డు ఛైర్మన్ నిత్యనిరంజన్ పేర్కొన్నారు.ఆలయంపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.
వాస్తవంగా మంగళవారం ఆ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరగాల్సి ఉంది.కొన్నేళ్ల క్రితం ఆలయం వెలుపల గోడపై కొన్ని పిచ్చిరాతలు ఉన్నాయని, వాటినని తాము పెద్దగా పట్టించుకోలేదని నిత్య నిరంజన్ పీటీఐతో తెలిపారు.
ఈ విషయాన్ని లాఎన్ఫోర్సుమెంట్ అధికారుల దృష్టికి సైతం తాముతీసుకోలేదని అన్నారు.ఈ ఘటనకు ఎవరి పాల్పడ్డారో తమకు తెలియదని ఆయన చెప్పారు.
ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు అలాంటి ప్రాంతంలో జరగడం విచిత్రమే అన్న వాదన బలంగా వినిపిస్తుంది.మరి దీనికి కారణం అయిన వారిని ఆ దేశం ఎలా శిక్షిస్తుందో చూడాలి.