ప్రజల రక్షణ కోసం ప్రభుత్వాలు పోలీసులు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ, నిత్యం పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ.ప్రజలలో అవగాహన కలగడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రతిరోజు నిత్యం ఎన్నో దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.
ఎంతోమంది నేరస్తులు దుండగులు పలుచోట్ల పెద్దఎత్తున దారుణాలకు పాల్పడుతూ ఉండడం వల్ల ప్రజలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటే వెనకడుగు వేస్తున్నారు.అయితే సాధారణ వ్యక్తుల పై మాత్రమే కాకుండా ఏకంగా సెలబ్రిటీల పై ఇలాంటి దారుణాలు, దాడులు జరుగుతున్నాయి.
తాజాగా హైదరాబాద్ మహానగరంలో టాలీవుడ్ హీరోయిన్ పై దాడి జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.24 గంటలు పోలీసులు నిఘా పెట్టి నిత్యం నగరంలో జరిగే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా కనిపెట్టుకొని ఉండే హైదరాబాద్ నగరంలో ఏకంగా హీరోయిన్ పై దాడి జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.ఆదివారం సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో హీరోయిన్ వాకింగ్ కోసం దగ్గరలో ఉన్నటువంటి కేబీఆర్ పార్క్ కు టాలీవుడ్ నటి, మోడల్ షాలు చౌరాసియా వెళ్లారు.
ఇలా పార్కుల్లో వాకింగ్ చేస్తున్నటువంటి ఈ నటిపై గుర్తుతెలియని దుండగులు కాపుకాసి ఏకంగా ఆమెపై దాడి చేశారు.
ఈ దాడిలో భాగంగా దుండగులు ఆమె సెల్ ఫోన్ లాక్కోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు.ఈ క్రమంలోనే దుండగుల చెర నుంచి తప్పించుకున్న ఈ నటి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన పార్కుకు చేరుకొని ఆమెను రక్షించారు.
ఈ గొడవలో హీరోయిన్ కు గాయాలు కావడం చేత ఆమెను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.అనంతరం నటి ఫిర్యాదు మేరకు కంప్లైంట్ రాసుకున్న పోలీసులు ఆ దుండగుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ఈ హీరోయిన్ పిల్లా నీల్ల, అరణ్యంలో వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించారు.
ఇలా హైదరాబాద్ నగరంలో నిత్యం జనసంచారం ఉన్న ప్రదేశంలోనే సదరు నటిపై ఈ విధమైనటువంటి దాడి జరిగిందని విషయం తెలియడంతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.అసలు ఆ దుండగులు ఏ ఉద్దేశంతో తనపై దాడి చేశారు అనే విషయం తెలియాల్సి ఉంది.ఇలా ఒంటరిగా వాకింగ్ చేస్తూ వెళ్తున్న నటిపై దుండగులు దాడి చేయడంతో సదరు నటి కూడా తీవ్ర స్థాయిలో భయపడినట్లు తెలుస్తోంది.
ఇక ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఈమె ఆరోగ్యం ప్రస్తుతం కుదటపడటంతో తనకు జరిగినట్టు ఎవరికీ జరగకూడదనే ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలియజేశారు.ప్రస్తుత కాలంలో సాధారణ ప్రజలకు రక్షణ లేదని భావిస్తున్న క్రమంలో ఇలా సెలబ్రెటీలు నటీనటుల పైకూడా దాడులు జరగడంతో ఇకపై ఒంటరిగా బయటకు వెళ్లాలన్నా ప్రతి ఒక్కరు ఎంతో ఆలోచించాల్సిన పరిస్థితిలు వస్తున్నాయని పలువురు అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.