కృష్ణా జిల్లా గుడివాడలో పేకాట క్లబ్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు చేసిన వారం రోజులకే దాడులు జరగడం.అందులోనూ మంత్రి బంధువులు కొందరు దొరికిపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
గుడివాడలో పేకాట క్లబ్లు చాలా పాతవే.అయితే వాటిపై దాడులు జరగడం.
భారీగా నగదుతో పాటు మంత్రి బంధువులు దొరికిపోవడమే ఇప్పుడు సంచలనం.గుడివాడలో ప్రతి రోజూ జరిగే పేకాటల్లో కోట్ల రూపాయలు చేతులు మారడం.
విదేశీ మద్యం పంపిణీ చేయడం చాలా చాలా కామన్.
ఈ పేకాట శిబిరాల వైపు అధికార యంత్రాంగం ఎప్పుడూ కన్నెత్తి చూసిన పాపాన పోలేదు.
అసలు అక్కడ దాడులు చేసేందుకు వెళ్లే ధైర్యం కూడా ఇప్పటి వరకు ఎవ్వరూ చేయరు.సదరు కీలక నేత ఆ రేంజ్లో అక్కడ పట్టు సాధించారు.కానీ ఇప్పుడే ఎందుకు ఇంత పెద్ద ఎత్తున దాడులు జరిగాయన్నదే ఎవ్వరికి అంతు పట్టడం లేదు.ముఖ్యంగా పేకాట శిబిరంలో ఏ సమయంలో పెద్ద ఎత్తున నగదు ఉంటుందో ? చూసి మరీ పోలీసులు ఆ సమయంలోనే దాడి చేయడాన్ని బట్టి చూస్తే ఇది ఎంత ప్లాన్తో జరిగిందో అర్థమవుతోంది.
ఇది ఈ పేకాట శిబిరాల వెనక ఉన్న అధికార పార్టీకి చెందిన ఆ దూకుడు నేతకు పెద్ద షాకే అంటున్నారు.ప్రభుత్వ పెద్దలు బాగా వ్యతిరేకించే ఓ సామాజిక వర్గానికి చెందిన ఆ నేత చంద్రబాబు, టీడీపీ, లోకేష్ అంటే తీవ్రమైన పదజాలంతో విరుచుకు పడుతుంటారు.సదరు కీలక నేత కూడా ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు తలూపడం తప్పా ఆయన ఎంత పెద్ద పదవిలో ఉన్నా చేసేదేం లేదు.అయితే సదరు కీలక నేతకు యంత్రాగంపై ఉన్న పట్టుకన్నా ఆ పైన ఉండే యంత్రాగానికి అక్కడ ఉండే పట్టు ఎక్కువ.
ఆయన ఎప్పుడు ఏం చేస్తున్నారో ? ఓ కంట కనిపెడుతూ ప్రభుత్వ పెద్దలకు చేరవేస్తుంటారు.ఇక త్వరలోనే జగన్ కేబినెట్ ప్రక్షాళన చేసి 20 మంది మంత్రులను తప్పించేయనున్నారు.
ఇప్పటికే వ్యక్తిగతంగా పతనమైపోయిన సదరు నేతను టార్గెట్ చేసే క్రమంలోనే ప్రభుత్వ పెద్దలు ఇలా చేశారని టాక్.ఇప్పటికే కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి జయరాంను ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టడంతో ఆయన సైలెంట్ అయ్యారు.
ఇక ఇప్పుడు కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి వంతు వచ్చిందంటున్నారు.