పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది.8 విడుతలలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఈసీ రెడీ అవగా మమతా బెనర్జీ సీరియస్ అయిన సంగతి తెలిసిందే.బీజేపీ కోసమే ఈ విధంగా ఎన్నికల నిర్వహిస్తున్నారని ఆరోపించడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉండగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఉత్తర 24 పరాగణాల జిల్లాలోని బీజేపీ ఆఫీస్ కొందరు వ్యక్తులు దాడులు చేసి కూల్చివేసారు.దీంతో ఆ ప్రాంతంలో బిజెపి కార్యకర్తలు మరియు నాయకులు రావడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
కావాలని మమతాబెనర్జీ పార్టీకి చెందిన వాళ్లే ఈ దాడికి పాల్పడినట్లు బిజెపి పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు.జరగబోయే ఎన్నికలలో ఓటమి భయంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడుతున్నట్లు కమలనాథులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు.