అవును, కెనడాలో ఖలిస్తాన్ ( Khalistan )మద్దతుదారులు ఓ దారుణమైన చర్యకు పాల్పడ్డారు.తాజాగా అక్కడ ఓ ర్యాలీ నిర్వహించారు.
ఐతే అది మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను స్పష్టంగా తెలియజేస్తుంది.కాగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఈ ఘటనను చాలా తీవ్రంగా ఖండిస్తూ.
ఇది హేయమైన చర్యగా అభివర్ణించారు.కెనడా ప్రభుత్వానికి ఈ దారుణమైన విషయాన్ని తెలియజేయాలని ఆయన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ను డిమాండ్ చేశారు.
కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో ఇందిరా గాంధీ హత్యను ప్రదర్శన రూపంలో ఇస్తూ 5 కి.మీ కవాతు నిర్వహించారు.దానికి సంబంధించినటువంటి వీడియోను కాంగ్రెస్ నేత మిలింద్ దేవరా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఈ వీడియోలో ఇందిరా గాంధీ( Indira Gandhi ) దిష్టిబొమ్మను ప్రదర్శించడం చాలా స్పష్టంగా చూడవచ్చు.రక్తంతో తడిసిన చీరలో ఈ దిష్టిబొమ్మకు ధరించి, ఇందిరాగాంధీ హత్య దృశ్యాన్ని మళ్లీ రూపొందించే ప్రయత్నం చేశారు.అంతేకాకుండా ఇందిరా గాంధీని చంపిన ఇద్దరు సిక్కు అంగరక్షకులను కూడా ఇక్కడ దిష్టిబొమ్మల రూపంలో చూపించారు.మిలింద్ డియోరా ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు… “ఇందిరా గాంధీ హత్యకు సంబందించిన దృశ్యాలను ప్రతిబింబించేలా కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో 5 కిలోమీటర్ల సుదీర్ఘ కవాతు నిర్వహించారు.
దీనిని చూసి ఒక భారతీయుడిగా నేను దిగ్భ్రాంతికి గురయ్యాను.ఇది ఒక దేశ చరిత్రను గౌరవించడం ఎంతమాత్రమూ కాదు, భంగపరచడమే అవుతుంది.” అని అన్నారు.
అంతేకాకుండా వారు ఓ దేశ ప్రధానమంత్రి హత్యకు సంబందించిన దృశ్యాలను బహిరంగంగా ప్రదర్శించారు.అదొక తీవ్రవాద చర్య.దీనికి దేశ ప్రజల ఐక్య ప్రతిస్పందన అనేది అవసరం… అంటూ పేర్కొన్నారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కూడా ఈ ఘటనను చాలా తీవ్రంగా ఖండించారు.
మిలింద్ దేవరా పోస్ట్ను రీట్వీట్ చేస్తూ.కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను.
ఇది చాలా దారుణమైన చర్య.విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.
జైశంకర్( S.Jaishankar ) ఈ విషయాన్ని కెనడా అధికారులతో సంప్రదించాలని ఈ సందర్భంగా వారంతా డిమాండ్ చేశారు.