మహిళా దినోత్సవం నాడు దారుణం..!!

ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని చాలామంది రాజకీయ నేతలు మరియు ప్రముఖులు మహిళల యొక్క గొప్పదనాన్ని కీర్తిస్తూ ఉన్నారు.మహిళా ప్రపంచం లేనిదే ఏ మగవాడి విజయం సాధించలేరు అని చెప్పుకొస్తున్నారు.

కుటుంబ జీవితాన్ని అదేవిధంగా పిల్లల యొక్క సంరక్షణ అన్ని పోషిస్తూ సమాజంలో కీలక పాత్ర పోషించేది మహిళా అంటూ పొగుడుతున్నారు.వ్యవస్థలు అదేవిధంగా జీవితాలు బాగు పడాలి అన్న మహిళ యొక్క పాత్ర ఎంతో కీలకం అని చెప్పుకొస్తున్నారు.

టోటల్ గా సమాజంలో మహిళ పాత్ర ఎంతో ప్రాముఖ్యం అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Telugu Alla Durgam, Gadi Peddapur, Medak, Womens Day-Latest News - Telugu

ఇలాంటి తరుణంలో మహిళా దినోత్సవం నాడు మెదక్ జిల్లాలో అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్ లో ఓ వివాహితపై యాసిడ్ దాడి జరగడం సంచలనం సృష్టించింది.గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై యాసిడ్ పోసి పారిపోయారు.వెంటనే స్థానికులు ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.

బాధితురాలి ది టేక్మాల్ మండలం అత్తయ్య పల్లి తండా అని పోలీసుల విచారణలో తేలింది.ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేసి… నిందితులను పట్టుకోవడానికి రెడీ అయ్యారు.

మహిళా పరిస్థితి విషమంగా ఉండటంతో… ఆమె స్పృహలోకి వచ్చాక పూర్తి వివరాలు తెలుసుకుని దర్యాప్తు స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube