ప్రజలకు కష్టం వస్తే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతారు.కానీ పోలీసులే ప్రజల పాలిట కీచకులుగా మారితే న్యాయదేవత కళ్లకు కట్టిన నల్ల బట్ట చాటున జరిగే అన్యాయాన్ని చూడలేక వచ్చే కన్నీరును కూడా కనబడకుండా దాచుకుంటుంది.
ఇలా పోలీసు శాఖలో అందరు ఉంటారని కాదు.కొందరు మాత్రం కామాంధులు, కీచకులు ఉన్నారు.బిందెడు పాలల్లో చుక్క విషం వేసిన ఆ పాలు పనికి రావు.అలాగే వ్యవస్దలో ఒక్క చీడపురుగు వల్ల ఆ వ్యవస్దనే నాశనం అవుతుంది.
ఇలాగే జరిగింది.అదేంటో తెలుసుకుంటే.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మీరట్ జిల్లా నాచండి పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న ఓ గెస్ట్ హౌస్ కి ఫిబ్రవరి 20న తన బాయ్ ఫ్రెండ్తో కలసి ఒక యువతి వెళ్లిందట.అయితే ఆ యువతి పై ఆ గెస్ట్ హౌస్ యజమాని కుమారుడి కన్ను పడింది.
అంతే పధకం ప్రకారం తనకు తెలిసిన పోలీసులకు విషయం చెప్పి పోలీస్ రైడ్ చేపించాడట.
అంతే కాకుండా దీన్ని అవకాశంగా తీసుకుని ఆమెపై అత్యాచారం చేశాడట.
ఇక పోలీసులైతే బెదిరింపులకు పాల్పడి ఆ యువతి దగ్గరున్న డబ్బులు తీసుకున్నారట.ఇక ఈ విషయంలో రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారారని సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ వస్తున్నాయట
.