అప్పు ఇది చేసేటప్పుడు బాగానే ఉంటుంది కానీ తీర్చేటప్పుడే తల ప్రాణం తోకకు వస్తుంది.ఇక అప్పు అనేది అత్యవసరం అయితేనే చేయాలి కానీ అనవసరం అయిన వాటికి కూడా ఊరంతా అప్పులు చేసుకుంటూ పోతే యమ పాశమై మెడకు చుట్టుకుంటుంది.
ముఖ్యంగా మనిషి తన కోరికలను అదుపులో పెట్టుకుంటే జీవితం సాఫీగా సాగుతుంది.కాదని గుర్రాల్లా కోరికలను పరిగెత్తిస్తే వాటి వెనక పరిగెత్త లేక ప్రాణాలు తీసుకోవలసి వస్తుందని ఈ ఘటన నిరూపించింది.
ఆ వివరాలు చూస్తే.
కడపజిల్లా బి కోడూరు మండల పరిధిలోని దిగువ సగిలేరు నదిలో భార్యభర్తలు, వారి ఇద్దరు చిన్న పిల్లల మృతదేహాలు నీటిలో తేలడంతో పోలీసులకు సమాచారం అందించారట స్దానికులు.
ఇక వీరి మృతి పై విచారణ చేసిన పోలీసులకు క్రికెట్ బెట్టింగ్ లో భారీగా మోసపోయి, దివాళాతీయడం ఆ కుటుంబాన్ని మానసికంగా ఒత్తిడికి గురిచేసిందని, దీనికి తోడు అప్పులిచ్చిన వారు వేధించడంతో అయోమయ పరిస్థితులలో వీరు ఆత్మహత్యకు పాలడినట్లుగా తెలిందట.ఏది ఏమైనా తండ్రి చేసిన పొరపాటుకు అభం శుభం తెలియని చిన్నారులు కూడా బలి అవడం పలువురి హృదయాలను కలచి వేస్తుందట.