ఏపీలో గత కొద్ది రోజుల క్రితం వరుసగా ఇక్కడున్న దేవాలయాలపై దాడులు జరిపి విగ్రహాలు ధ్వంసం చేసిన ఘటనలు ఆందోళనను కలిగించాయి.ఈ నేపధ్యంలో ఈ అపవాదు ప్రభుత్వం పై పడింది.
దీంతో చర్యలు చేపట్టిన ఏపీ ప్రభుత్వం మొత్తానికి ఈ దాడులను నివారించ గలిగింది.
ఇక ఇలాంటి వివాదాలు, దాడులు తెరపైకి రాలేదని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మరోసారి దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం చేయడం సంచలనంగా మారింది.
ఆ వివరాలు చూస్తే.కడప జిల్లా, రైల్వేకోడూరు టోల్ ప్లాజా దగ్గర ఉన్న ఆలయంలోని దేవుళ్ల విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.
కాగా ఈ దాడిలో సీత, రాముడి విగ్రహాలతో పాటు ఆంజనేయస్వామి విగ్రహాం కూడా ధ్వంసం అయ్యాయి.ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా ఈ ఘటనకు బాధ్యుడైన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా సమాచారం.
ఇక ఈ విగ్రహల ద్వంసం పై హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి.ఇన్ని రోజులుగా నిశబ్ధంగా ఉన్న వారు తాజాగా ఇలాంటి విద్వంసానికి పాల్పడటం ఆందోళన కలిగిస్తుందంటున్నారు హిందువులు.