ఏపీలో దారుణం.. దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం చేసిన దుండగులు.. ?

ఏపీలో గత కొద్ది రోజుల క్రితం వరుసగా ఇక్కడున్న దేవాలయాలపై దాడులు జరిపి విగ్రహాలు ధ్వంసం చేసిన ఘటనలు ఆందోళనను కలిగించాయి.ఈ నేపధ్యంలో ఈ అపవాదు ప్రభుత్వం పై పడింది.

 Atrocities In Ap Thugs Who Destroyed Idols Of Gods, Kadapa, Kodur, Damage, God I-TeluguStop.com

దీంతో చర్యలు చేపట్టిన ఏపీ ప్రభుత్వం మొత్తానికి ఈ దాడులను నివారించ గలిగింది.

ఇక ఇలాంటి వివాదాలు, దాడులు తెరపైకి రాలేదని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మరోసారి దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం చేయడం సంచలనంగా మారింది.

ఆ వివరాలు చూస్తే.కడప జిల్లా, రైల్వేకోడూరు టోల్ ప్లాజా దగ్గర ఉన్న ఆలయంలోని దేవుళ్ల విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.

కాగా ఈ దాడిలో సీత, రాముడి విగ్రహాలతో పాటు ఆంజనేయస్వామి విగ్రహాం కూడా ధ్వంసం అయ్యాయి.ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా ఈ ఘటనకు బాధ్యుడైన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా సమాచారం.

ఇక ఈ విగ్రహల ద్వంసం పై హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి.ఇన్ని రోజులుగా నిశబ్ధంగా ఉన్న వారు తాజాగా ఇలాంటి విద్వంసానికి పాల్పడటం ఆందోళన కలిగిస్తుందంటున్నారు హిందువులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube