ప్రస్తుత సమాజంలో ఆడవారిపై జరుగుతున్న అన్యాయాలను చూస్తుంటే నిజంగానే చాలా బాధగా అనిపిస్తోంది.ఏకంగా నడిరోడ్డుమీదే వారిపై దైర్జన్యాలు జరుగుతున్నా కూడా ఆపలేని దుస్థితిలో సమాజం ఉంది.
ఇక ఇలాంటి ఘటనే ఒకటి పాకిస్థాన్లో జరగడం దుమారం రేపుతోంది.పాకిస్థాన్లోని ఓ ప్రాంతంలో ఎడ్ల బండి లాగుతున్న రిక్షాలో వెనక భాగంలో ఇద్దరు అమ్మాయిలు కూర్చుని ప్రయాణం చేస్తున్నారు.
ఇక్కడ వారితో పాటు ఓ చిన్నారి కూడా ఉంది.ఇక రాత్రి వేళ కావడంతో కొంచెం రద్దీగానే ఉంది ఆ ఏరియాలో.
అయితే ఇలా జనాల మధ్య నుంచి వెళ్తున్న ఆ రిక్షా వద్దకు ఒకడు వేగంగా వచ్చి రిక్షా ఎక్కి చివరన కూర్చున్న ఆ అమ్మాయి బుగ్గ మీద ముద్దు పెట్టి రెప్ప పాటి వేగంతో మాయమైపోయాడు.ఇక క్షణకాలం జరిగిన ఈ అనూహ్య ఘటనతో బాధితురాలు షాక్ అయిపోయింది.
మరీ ఇంత దారునంగా ఇలా చేయడమేంటని వారు ఆశ్చర్యపోయారు.అయితే ఇలా వారి దగ్గరకు వచ్చేందుకు మరో వ్యక్తి కూడా ప్రయత్నించగా పక్కనున్న అమ్మాయి, బాధితురాలు ఇద్దరూ కూడా చెప్పు తీయడంతో ఆ దుండగులు దగ్గరకు వచ్చే ప్రయత్నం చేయలేదు.
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆ దుర్మార్గుడు ముద్ద8ఉ పెట్టేముందు అసభ్య సంకేతాలు చేయడంతో ఆ అమ్మాయిలు ఇద్దరూ కూడా అటువైపు చూడలేక ముందువైపు తమ చూపు తిప్పుకున్నారు.ఇక వారు తలలు ముందుకు తిప్పడంతో ఇదే అదునుగా భావించిన ఆ యువకుడు రిక్షా దగ్గరకు వెళ్లే సాహసం చేవాడు.ఇంకా చెప్పాలంటే ఈ దారుణం పాకిస్థాన్ దేశ స్వాతంత్ర్య దినోత్సవంమైన ఆగస్ట్ 14నే కావడం ఇంకా సంచలనం రేపుతోంది.ప్రస్తుతం ఈ వీడియోను చూసి వారంతా కూడా ఇంత దారుణంగా పాకిస్థాన్లో మహిళల పరిస్థితి ఉందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.