హైదరాబాద్( Hyderabad ) నగరంలో భూక్యా అశోక్ మద్యానికి బానిసగా మారి ఏకంగా ఫ్లైఓవర్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ ఘటన హైదరాబాద్ బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పూర్తి విషయంలోకి వెళ్తే అశోక్ వెల్డింగ్ షాపులో కార్మికుడిగా పనిచేస్తూ ఉంటాడు.కొద్ది నెలల క్రితం రేష్మా బేగం( Reshma Begum ) అనే మహిళను ప్రేమ వివాహం చేసుకొని….
కోమటి బస్తీలో నివాసం ఉంటున్నాడు.అయితే ప్రతిరోజు మద్యం సేవించి భార్యని చిత్రవాదులకు గురి చేస్తూ ఇష్టానుసారంగా కొడుతూ హింసించేవాడు.
అంతేకాకుండా మద్యం మత్తులో తాను చనిపోతానని కొన్నిసార్లు ఆత్మహత్యకు పాల్పడి.బ్లేడుతో కోసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇదిలా ఉంటే సోమవారం కూడా మద్యం సేవించి భార్యను చితక్కొట్టడం జరిగింది.అనంతరం ఆత్మహత్య చేసుకుంటానని ఇంటి నుంచి అశోక్ వెళ్లిపోవడం జరిగింది.ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో హైదరాబాద్ బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లైఓవర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.తీవ్ర గాయాల పాలైన అశోక్ నీ స్థానికులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది.
అయితే అప్పటికే అశోక్ ( Ashok )మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.అశోక ఆత్మహత్యకు పాల్పడ్డ దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి.
సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.